WPL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) రసవత్తరంగా సాగుతోంది. మహిళా ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. సిక్సులు, ఫోర్లతో అల్లాడిస్తున్నారు. ఆదివారం గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఈ పోరులో చివరి నిమిషంలో యూపీ జట్టు గెలుపొందింది. యూపీ బ్యాటర్ కిరణ్ నవ్గిరె ఆఫ్ సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించింది. 43 బంతుల్లో 53 పరుగులు చేసింది. అందులో 5ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ల కంటే నవ్గిరి పట్టుకున్న బ్యాటే అందర్నీ ఆకర్షించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఆ బ్యాట్ వైరలవుతోంది. ఎందుకంటే ఆ బ్యాట్పై తన ఫేవరెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పేరు రాసుకుంది. స్పాన్సర్ లేబుళ్లకు బదులుగా MSD 07 అని బ్యాట్పై రాసుకుంది.
ధోనిలా సిక్సులు కొట్టాలనే ఒకే ఒక ఆలోచనతో క్రికెట్ నేర్చుకున్నానని.. అందుకే బ్యాట్పై ధోని పేరు రాసుకున్నానని కిరణ్ నవ్గిరి చెప్పుకొచ్చింది. 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ను గెలిచినప్పటి నుంచి ధోనికి అభిమానిని అయిపోయానని తెలిపింది. ఆయన ప్రతి మ్యాచ్ చూస్తూ ఎంతో నేర్చుకున్నానని వెల్లడించింది.