Fritz beat Zverev: లండన్లో జరుగుతున్న వింబుల్డన్ టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగుతోంది. మహిళల, పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీట్ ఆటగాళ్లు ఇంటిదారి పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో ఆటగాడు చేరిపోయాడు. జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ వంతైంది.
సోమవారం వింబుల్డన్లో ఊహించని మ్యాచ్ జరిగింది. నాలుగో నెంబర్ ఆటగాడు జ్వెరెవ్ ఖంగుతిన్నాడు. అంతేకాదు టోర్నీ నుంచి ఊహించని రీతిలో వెనుదిరిగాడు. జర్మనీకి చెందిన నాలుగో సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్- అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్ మధ్య మూడున్నర గంటల సేపు హోరాహోరీ పోరు సాగింది. ఇందులో 6-4, 7-6, 4-6, 6-7, 3-6 తేడాతో జ్వెరెవ్ను మట్టి కరిపించాడు ఫ్రిట్జ్.
తొలి రెండు సెట్లను గెలుచుకున్న జ్వెరెవ్, మూడోది సునాయాశమేనని అందరూ భావించారు. అమెరికా ఆటగాడు ఫ్రిట్జ్ ఔట్ అని మ్యాచ్ చూసిన ఆటగాళ్లు భావించారు. మూడో సెట్ నుంచి మ్యాచ్ టర్న్ అయ్యింది.. ఫ్రిట్జ్ క్వార్టర్స్కు చేరుకోగా, జ్వెరెవ్ ఇంటిదారి పట్టాడు. ఫ్రిట్జ్.. 12వ ర్యాంక్ ఆటగాడు కాగా, జ్వెరెవ్ నాలుగో నెంబర్ ఆటగాడు.
ALSO READ: ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా.. బీసీసీఐలో మార్పులు ఖాయమా?
జ్వెరెవ్ ప్రధాన బలం బలమైన సర్వీసులు చేయడం. ఆయన వీక్నెస్ ర్యాలీలో పెద్దగా ఆడలేకపోవడం. 33 అనవసర తప్పిదాలకు పాల్పడి ఓటమిని కొని తెచ్చుకున్నాడు. ప్రత్యర్థి జ్వెరెవ్ వీక్నెస్ని రెండు సెట్లలో గమనించిన ఫ్రిట్జ్.. మూడో సెట్స్ నుంచి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మూడు, నాలుగు, ఐదు సెట్లను వరుసగా గెలుచుకుని క్వార్టర్స్కి చేరుకున్నాడు.
Fritz's fantasy comes true on Centre Court 😤⚡️#Wimbledon pic.twitter.com/bTQUKscFVB
— Wimbledon (@Wimbledon) July 8, 2024