Will Virat Kohli and Rishabh Pant play for Delhi in Ranji Trophy: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అనేక మైలురాళ్లను.. దాటుకొని వచ్చాడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు వెళ్తున్నాడు విరాట్ కోహ్లీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో రాణిస్తూనే ఇటు టీమిండియాలో కూడా.. అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు విరాట్ కోహ్లీ.
అలాంటి విరాట్ కోహ్లీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే విరాట్ కోహ్లీ రంజిత్రోఫీ కూడా ఆడబోతున్నట్లు నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ త్వరలోనే రంజీల్లో ఆడనున్నట్లు సమాచారం. ఢిల్లీ ప్రాబబుల్స్ లో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆడబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.
ఇదే జట్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరును కూడా డిడిసిఏ చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. చండీగఢ్ తో జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు జాతీయ మీడియా లో కథనాలు వస్తున్నాయి. ఈ రంజీ ట్రోఫీ ప్రారంభం అయ్యేసరికి… బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కూడా పూర్తి అవుతుంది. అంటే ఈ సిరీస్ అయిపోయిన తర్వాత లండన్ కి వెళ్లకుండా… ఇండియాలోనే ఉండబోతున్నాడు విరాట్ కోహ్లీ.
Also Read: IPL 2025: MS ధోని కోసం చెన్నై కొత్త కుట్రలు..షాక్ లో ఫ్యాన్స్ ?
ఇండియాలోనే ఉంటూ ఈ రంజిత్రోఫీ ఆడతాడు అన్నమాట. ఇప్పటివరకు.. రంజిత్ ట్రోఫీలు విరాట్ కోహ్లీ చాలానే ఆడాడు. కానీ టీమిండియాలో తన ప్రస్థానం ప్రారంభమైన తర్వాత రంజిత్రోఫీలు ఆడడం బాగా తగ్గించేశాడు. 2012 సీజన్ లో మాత్రం విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలో ఆడడం జరిగింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ పై చెలరేగి న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికయ్యాడు విరాట్ కోహ్లీ.
Also Read: IPL 2025: ఐపీఎల్ జట్లకు BCCI గుడ్ న్యూస్..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాలసీ…?
ఇక ఇప్పుడు మళ్లీ రంజిత్రోఫీలో అడుగుపెట్టి… రాణించాలని అనుకుంటున్నాడు. కాగా బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో… టీమిండియా 280లో తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేదు. రెండు ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అయితే రెండో టెస్టులు అయిన విరాట్ కోహ్లీ రాణిస్తాడని… ఆయన అభిమానులు అనుకుంటున్నారు.