Double Century Records: బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో డబుల్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు… టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ పేరు మీద ఉంది. గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా… ఇషాన్ కిషన్ 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదేశాడు. అతని ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు, 24 ఫోర్లు ఉన్నాయంటే… ఏ రేంజ్ లో చెలరేగి ఆడాడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు… కెరీర్లో పదో వన్డేలోనే డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు… ఇషాన్ కిషన్.
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు మొత్తం 9 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఈ ఘనత సాధించిన అంతర్జాతీయ క్రికెటర్లలో ఇషాన్ కిషన్ 7వ బ్యాటర్. టీమిండియా క్రికెటర్లలో మాత్రం నాలుగోవాడు. ఇంతకు ముందు సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు బాదారు. ఈ ముగ్గురిలో హిట్ మ్యాచ్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు(264, 209, 208) కొట్టడం విశేషం. తాజాగా ఇషాన్ కిషన్ చేసిన డబుల్ సెంచరీతో… వన్డేల్లో టీమిండియా తరఫున నమోదైన డబుల్ సెంచరీల సంఖ్య ఆరుకు చేరింది.
ఔట్ కాకుండా ఉంటే బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ కూడా చేసేవాడినని చెప్పాడు… ఇషాన్ కిషన్. మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే తాను ఔటయ్యానని… ఔట్ కాకపోతే కచ్చితంగా ట్రిపుల్ సెంచరీ చేసి… వన్డేల్లో ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా నిలిచేవాడినని చెప్పాడు… ఇషాన్ కిషన్. వన్డేల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు కాస్త అసంతృప్తిగా ఉందన్నాడు.