EPAPER
Kirrak Couples Episode 1

Match : తొలి వన్డేలో భారత్ కు షాక్…లాథమ్ విధ్వంసం.. కివీస్ ఘన విజయం

Match : తొలి వన్డేలో భారత్ కు షాక్…లాథమ్ విధ్వంసం.. కివీస్ ఘన విజయం

Match : న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ కైవసం చేసుకుని ఊపుమీదున్న టీమిండియాకు తొలి వన్డేలో షాక్ తగిలింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కివీస్ జట్టు 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని మరో 17 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.


లాథమ్ విధ్వంస…కేన్ సహకారం..
19.5 ఓవర్లలో 88/3 . ఇది న్యూజిలాండ్ పరిస్థితి. ఆ సమయంలో భారత్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో కీపర్ టామ్ లాథమ్ జత కలిశాడు. ఈ జోడి నెమ్మదిగా స్కోర్ ను పెంచుకుంటూ వెళ్లింది. హాఫ్ సెంచరీ దాటిన తర్వాత లాథమ్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. అదే జోరుతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ విలియమ్సన్ కుదురుగా ఆడుతూ లాథమ్ కే ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించాడు. తొలి 20 ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులు వేసిన భారత్ బౌలర్లు లాథమ్ విధ్వంసంతో తేలిపోయారు. సెంచరీ తర్వాత అదే జోరు కొనసాగించిన లాథమ్ 104 బంతుల్లో 145 (19 ఫోర్లు, 5 సిక్సులు) పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 98 బంతుల్లో 94 ( 7 ఫోర్లు, సిక్సు) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో కివీస్ జట్టు మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

బౌలర్ల వైఫల్యం
భారత్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు, శార్ధుల్ ఠాకూర్ కు ఒక వికెట్ దక్కాయి. అయితే ఇద్దరూ ధారళంగా పరుగులు ఇచ్చేశారు. వాసింగ్టన్ సుందర్ వికెట్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అర్షదీప్ సింగ్, చాహల్ ఇద్దరూ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్ లో బౌలర్లు పూర్తి విఫలమయ్యారు.


ముగ్గురు అర్ధ శతకాలు
అంతుకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (72 పరుగులు) , శుభమన్ గిల్ ( 50 పరుగులు) మరోసారి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ అర్ధ సెంచరీలతో మెరిశారు. టీ20ల్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ లో 80 పరుగులతో రాణించాడు. సంజు శాంసన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 36 పరుగులు చేశాడు. చివరిలో వాసింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 37 పరుగులు చేయడంతో భారత్ న్యూజిలాండ్ ముందు 307 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ , లాకీ ఫెర్గూసన్ తలో 3 వికెట్లు తీశారు. ఆడమ్ మిల్నేకు ఒక వికెట్ దక్కింది. అద్భుత శతకంతో అజేయంగా నిలిచిన కీపర్ టామ్ లాథమ్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. జరగబోయేది ఇదేనా?

High Tension At Anantapur: టెన్షన్ లో అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు.. ఎందుకంటే..?

Katipally Venkataramana Reddy: ఆరు నెలలకే కథ రివర్స్.. అయోమయంలో కాటిపల్లి

Tirupati Laddu Sanctity Restored: తిరుమలలో దోషం ఎలా పోగొట్టారంటే..

Balineni Vs Damacharla: బాలినేని చిచ్చు.. జనసేన, టీడీపీ మధ్య విభేదాలు?

Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!

Kimidi Family Cold War: కిమిడి ఫ్యామిలీ వార్.. 40 ఇయర్స్ ఇండస్ట్రీలో కత్తులు దూసుకునే రాజకీయం

Big Stories

×