Smriti Mandhana with the Trophy With Her Boyfriend Photo got Viral: ఆర్సీబీ అమ్మాయిలు ట్రోఫీ సాధించడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. అందరూ అభినందనలతో టీమ్ ని ముంచెత్తుతున్నారు. అంతేకాదు అమ్మాయిల ఆటకు ఫిదా అవుతున్నారు. ఈ సమయంలో వచ్చిన ఒక ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఎవరిదో కాదు రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీ పాత ఓనర్, భారతీయులకు సుపరిచితుడైన ప్లే బాయ్ విజయ్ మాల్యాది.
అందరూ ఆ ట్వీట్ చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు ఆయన జట్టే కదా…వ్యాపారాలు చూసుకోకుండా ఎంజాయ్ చేశాడు. తర్వాత చూసేసరికి చేయి జారిపోయింది. ఇప్పుడు డబ్బులు కడతానని అంటున్నాడు. తప్పు చేయలేదని చెబుతున్నాడు. కానీ చేసిన నేరం చెరిపేస్తే పోదని చట్టాలు చెబుతున్నాయి. అందుకనే అక్కడ ఉండిపోయాడని కొందరు అంటున్నారు. ఒకప్పుడు తను, ఆ ఫ్రాంచైజీ ఓనర్.. మరిచిపోవద్దని కొందరు గుర్తు చేస్తున్నారు.
ఇంతకీ విజయ్ మాల్యా ఏమన్నాడంటే.. ఉమన్ ఐపీఎల్ టైటిల్ గెలిచినందుకు ఆర్సీబీ మహిళల జట్టుకు హృదయపూర్వక అభినందనలు. అయితే ఐపీఎల్ లో పురుషుల జట్టు కూడా గెలిస్తే, అప్పుడు ఆనందం డబుల్ అవుతుంది. గుడ్ లక్…అని రాశాడు.
Also Read: ఢిల్లీ.. 64/0 కట్ చేస్తే..113 కి ఆలౌట్: ఏం మాయ జరిగింది?
గెలిచిన ట్రోఫీ, బాయ్ ఫ్రెండ్ తో స్మృతి ఫోజ్
ఇప్పుడు విజయ్ మాల్యా ట్వీట్ తో పాటు మరొక ఫొటోపై కూడా నెట్టింట డిస్కషన్ మొదలైంది. ఆర్సీబీ ట్రోఫీతో స్మృతి మంథాన ఫోజు ఇచ్చింది. అయితే తనతో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. తనేం చేశాడంటే, స్మృతి భుజం మీద చెయ్యి కూడా వేశాడు.
చాలా మండి కుర్రాళ్లకి, అభిమానులకి కోపం వచ్చింది. ఎవడీ కుర్రగాడు, అంత ధైర్యంగా స్మ్రతి భుజం మీద చెయ్యేశాడని నెటిజన్లు తెగ వెతికీసేరు. ఇంతకి తనెవరంటే స్మృతి మంథాన బాయ్ ఫ్రెండ్ అన్నమాట. తన పేరు పలాష్ ముచల్ అని ఎట్టకేలకు గుర్తించారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు డైరక్ట్ అయిపోయాడు.
ఇంతకీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, మ్యూజిక్ డైరక్టర్. ఆర్త్ అనే వెబ్ సిరిస్ కి పనిచేశాడు. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమలోనే ఉండిపోయారు. స్మ్రతి కెరీర్ ఉండేవరకు బహుశా వీరు పెళ్లి చేసుకోకపోవచ్చునని అంటున్నారు. అంటే 40 ఏళ్లు రావాలా? అని ఒకరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి ట్రోఫీకన్నా ఈ గొడవ ఎక్కువైందని కొందరంటున్నారు.