Sania Mirza: ఫేర్ వెల్ మ్యాచ్లో సానియా మీర్జా విజయం సాధించింది. హైదారాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సింగిల్స్ విభాగంలో రోహన్ జోపన్నపై గెలుపొందింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సానియా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. తన కెరీర్లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో కంటతడి పెట్టుకుంది.
ఇక సానియా చివరి మ్యాచ్ చూసేందుకు మంత్రి కేటీఆర్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ తదితరులు స్టేడియానికి చేరుకున్నారు. వారితో పాటు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో ఎల్బీ స్టేడియంలో సందడి నెలకొంది.
ఇక ఇవాళ సాయంత్రం హైదారాబాద్లోని ఓ స్టార్ హోటల్లో రెడ్ కార్పెట్ ఈవెంట్, గాలా డిన్నర్ జరగనుంది. ఈ ఈవెంట్కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు,సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ఖాన్, సినీ ప్రముఖులు మహేష్ బాబు, ఏఆర్ రెహమాన్ హాజరుకానున్నారు.