SA vs IND Second Test : తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా రెండోటెస్టులో ప్రతాపాన్ని చూపిస్తోంది. తొలి సెషన్ లోనే సఫారీ జట్టును ఆలౌట్ చేసింది. కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టుకు భారత్ పేసర్లు చుక్కలు చూపించారు. 55 పరుగులకే ఆలౌట్ చేశారు.
ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వికెట్ల సిక్సర్ సాధించాడు. బుమ్రా, ముఖేశ్ కుమార్ తలో రెండు వికెట్లు తీశారు. దీంతో తొలిసెషన్ లోనే దక్షిణాఫ్రికా జట్టు 23.2 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది. సఫారీ జట్టులో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. కీపర్ కైల్ వెరినే (15), డేవిడ్ బెడింగ్హమ్(12) రెండెకల స్కోర్ సాధించారు. మిగతా బ్యాటర్లలో ఒక్కరూ కూడా 5 పరుగుల దాటలేదు. 1932 తర్వాత సౌత్ ఆఫ్రికా టెస్టుల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఇండియాపై ఏ జట్టుకైనా ఇదే అతి తక్కువ స్కోర్.