Rohit, Kohli and Pandya Will be Rest on Sri Lanka Tour: ఈనెల చివరి నుంచి శ్రీలంక పర్యటను వెళ్లోంది టీమిండియా. అయితే సీనియర్ ఆటగాళ్లకు ముగ్గురు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. వారిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్ధిక్ పాండ్యా ఉన్నారు.
శ్రీలంకతో టీ20 సిరీస్కి కెప్టెన్గా హార్ధిక్పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారు. సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడట. ఈ ఫార్మాట్కు రోహిత్శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్రజడేజా గుడ్ బై చెప్పేశా రు. వన్డేలకు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆటగాళ్లకు రెస్టు ఇవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఐపీఎల్ తర్వాత నేరుగా టీ20 టోర్నమెంట్ మొదలైంది.
ఆటగాళ్లకు ఎలాంటి రెస్టు లేదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రస్తుతం రోహిత్శర్మ అమెరికా వెళ్లాడు. విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో లండన్కు వెళ్లాడు. మరో ఆటగాడు హార్థిక్పాండ్యా సోమవారం గుజరాత్కు వెళ్లాడు. తనకు రెస్టు కావాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేసినట్టు అంతర్గత సమాచారం.
ALSO READ: పాండ్యా జీవితంలో చీకటి వెలుగులు.. వడోదరాలో ఘన స్వాగతం
సీనియర్ ఆటగాళ్లు విదేశాల్లో జరిగే సిరీస్కు లేకపోతే కష్టమని కొత్త కోచ్ గంభీర్ భావిస్తున్నాడట. ఈ క్రమంలో టీ20కి అందుబాటులో ఉంటానని, వన్డేలకు విశ్రాంతి కావాలని పాండ్యా కోరినట్టు సమాచారం. ఇక టీ20లో రాణించిన కుల్దీప్యాదవ్, అర్షదీప్లను లంక టూర్కు ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.