Rohit Sharma Fan Moment : హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ – భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని మైదానంలోకి దూసుకెళ్లాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆ యువకుడి వెంటే పరుగెత్తికొచ్చారు. అప్పటికే ఆ యువకుడు.. క్రీజులో ఉన్న రోహిత్ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కాడు. అక్కడకి చేరుకుని భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మైదానంలో మిగతా ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
పిచ్ వద్దకు ఓ అభిమాని వెళ్లడంపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సీరియస్ అయ్యారు. ఉప్పల్ స్టేడియానికి సీపీ వెళ్లారు. క్రికెట్ అభిమాని మైదానంలోకి వెళ్లిన ఘటనపై ఆరా తీశారు. క్రికెట్ అభిమాని మైదానంలోకి ఎలా వెళ్లారని విధుల్లో ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.