EPAPER

Rohit Sharma: ఆ విషయం తెలుసు.. బాధపడను.. కచ్చితంగా సెంచరీ కొడతా!

Rohit Sharma: ఆ విషయం తెలుసు.. బాధపడను.. కచ్చితంగా సెంచరీ కొడతా!

Rohit Sharma: రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌కు టీమిండియా చుక్కలు చూపించింది. భారత ఆటగాళ్లు తమ బౌలింగ్‌తో అదరగొట్టారు. మ్యాచ్ ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కివీస్ బ్యాటర్లను వణికించాడు. అయితే భారత బౌలర్ల ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. టీమిండియా బౌలింగ్ గాడిన పడడం తమకు కలిసొచ్చే అంశం అని వెల్లడించాడు.


భారత బౌలర్లలో అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నాయని తెలిపాడు. గత ఐదు మ్యాచుల్లోనూ అద్భుత ప్రతిభ కనబర్చారని వెల్లడించాడు. జట్టులో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసం రెట్టింపైందని, జట్టును ఇలా చూడడం గొప్పగా ఉందని చెప్పాడు. తాను భారీ స్కోర్ చేయడం లేదనే విషయం తనకు తెలుసని.. ఈ విషయం గురించి తాను బాధపడడం లేదని అన్నారు. త్వరలో తన ఆట తీరును మార్చుకొని.. భారీ స్కోర్‌ను సాధిస్తానని వివరించాడు. ఇండోర్ వేదికగా జరిగే చివరి వన్డే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని అన్నాడు.

ఇక రెండో వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 108 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో భారత్ చేధించింది . దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌గిల్ (40*)తో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 11, ఇషాన్ కిషన్ 8 పరుగులు చేశారు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×