E-Paper
Advertisement

Rohit Sharma: ఆ విషయం తెలుసు.. బాధపడను.. కచ్చితంగా సెంచరీ కొడతా!

Rohit Sharma: ఆ విషయం తెలుసు.. బాధపడను.. కచ్చితంగా సెంచరీ కొడతా!

Rohit Sharma: రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌కు టీమిండియా చుక్కలు చూపించింది. భారత ఆటగాళ్లు తమ బౌలింగ్‌తో అదరగొట్టారు. మ్యాచ్ ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కివీస్ బ్యాటర్లను వణికించాడు. అయితే భారత బౌలర్ల ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. టీమిండియా బౌలింగ్ గాడిన పడడం తమకు కలిసొచ్చే అంశం అని వెల్లడించాడు.

భారత బౌలర్లలో అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నాయని తెలిపాడు. గత ఐదు మ్యాచుల్లోనూ అద్భుత ప్రతిభ కనబర్చారని వెల్లడించాడు. జట్టులో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసం రెట్టింపైందని, జట్టును ఇలా చూడడం గొప్పగా ఉందని చెప్పాడు. తాను భారీ స్కోర్ చేయడం లేదనే విషయం తనకు తెలుసని.. ఈ విషయం గురించి తాను బాధపడడం లేదని అన్నారు. త్వరలో తన ఆట తీరును మార్చుకొని.. భారీ స్కోర్‌ను సాధిస్తానని వివరించాడు. ఇండోర్ వేదికగా జరిగే చివరి వన్డే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని అన్నాడు.

ఇక రెండో వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 108 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో భారత్ చేధించింది . దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌గిల్ (40*)తో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 11, ఇషాన్ కిషన్ 8 పరుగులు చేశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×