Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా తన హెల్త్కు సంబంధించి అప్డేట్ ఇచ్చాడు.. రిషబ్. ఊతకర్ర సాయంతో నడుస్తున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘ ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా.. ఒక అడుగు మరింత మెరుగ్గా’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అభిమానులు, పంత్ త్వరగా కోలుకొని గ్రౌండ్లో అడుగుపెట్టాలని కామెంట్లు పెడుతున్నారు.
ఇక పోయిన ఏడాది డిసెంబర్లో పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను డ్రైవ్ చేస్తున్న కారు రూర్మీ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్రం గాయపడిన పంత్ను స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. జనవరి 26న అతడి మోకాలికి సర్జరీ అయింది. యాక్సిడెంట్ తర్వాత పంత్ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయడం ఇదే మొదటిసారి.