Re Entry After A Year Will Rohit Target Against Bangladesh:భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ వచ్చే నెల 19 నుంచి స్టార్ట్ కానుంది. ఈ సిరీస్ అక్టోబర్ 1 వరకు ఇరుదేశాల మధ్య టెస్టు సిరీస్ హోరాహోరిగా జరగనుంది. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 23 వరకు తొలి మ్యాచ్ జరుగుతుంది. సిరీస్లోని రెండో టెస్టు మ్యాచ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతుంది. బంగ్లాదేశ్తో జరిగే ఈ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మన్ తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
బంగ్లాదేశ్తో సిరీస్ టైమ్లో, ఒక భయంకరమైన బ్యాట్స్మెన్ ఒకటిన్నర ఏళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను కెప్టెన్ రోహిత్ శర్మకు బ్రహ్మాస్త్రంగా నిరూపించుకోనున్నాడు. భారత జట్టులోని ఈ క్రికెటర్ టెస్టు సిరీస్లో బంగ్లాదేశ్ జట్టు మొత్తాన్ని సింగిల్గా నాశనం చేయగల సత్తా మనోడి సొంతం. టీమిండియా ఆటగాడు క్రీజులోకి రాగానే బంగ్లాదేశ్ బౌలర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బ్రహ్మాస్త్రం రిషబ్ పంత్. దాదాపు ఏడాదిన్నర తర్వాత భారత టెస్టు జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నాడు. రిషబ్ పంత్ బంగ్లాదేశ్తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడినాడు. రిషబ్ పంత్ తన చివరి టెస్ట్ మ్యాచ్ 2022లో బంగ్లాదేశ్తో ఆడినాడు. రిషబ్ పంత్ డిసెంబర్ 2022 చివరిలో ఒక భయంకరమైన కారు ప్రమాదానికి గురి అయ్యాడు. ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ జూన్ 2024 లో టీ20 ప్రపంచకప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్కు తిరిగి ఎంట్రీ ఇచ్చాడు.
Also Read: రెజ్లర్ వినేష్ ఫోగాట్కు సీఏఎస్ సూటి ప్రశ్న, వాటిపైనే తీర్పా..!
దీని తర్వాత ఇటీవల శ్రీలంక పర్యటనలో రిషబ్ పంత్ కూడా వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు రిషబ్ పంత్ టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్లో రిషబ్ పంత్ ఐదవ స్థానంలో తన తుఫాన్ బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్లో ఎక్స్ ఫాక్టర్ లోపాన్ని భర్తీ చేయగలడనే నమ్మకం జట్టుకు ఉంది. రిషబ్ పంత్ విధ్వంసక బ్యాటింగ్ ముందు ప్రత్యర్థి జట్టు బౌలర్లు సైతం మోకరిల్లాల్సిందేనంటూ ధీమాగా ఉన్నారు. టీమిండియాకు అతిపెద్ద బలం స్పిన్నర్లకు వ్యతిరేకంగా రిషబ్ పంత్ అద్భుతమైన టెక్నిక్ కలిగిన ఆటగాడు. రిషబ్ పంత్ స్పిన్నర్లకు వ్యతిరేకంగా ఆడుతాడు. రిషబ్ పంత్ ఫోర్లు,, సిక్సర్లు బాది స్పిన్నర్లపై ఒత్తిడి తెస్తాడు. బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్లో స్పిన్నర్లు కూడా కీరోల్ పోషించే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రిషబ్ పంత్ టీమిండియాకు అతిపెద్ద బూస్టర్ కానుంది. రిషబ్ పంత్ 33 టెస్టు మ్యాచ్ల్లో 2271 రన్స్ చేసి హౌరా అనిపించాడు. ఈ టైమ్లో రిషబ్ పంత్ 5 సెంచరీలు,, 11 హాఫ్ సెంచరీలు కొట్టాడు. టెస్టుల్లో రిషబ్ పంత్ అత్యుత్తమ స్కోరు 159గా ఉంది. టెస్టు క్రికెట్లో రిషబ్ పంత్ వన్డే,, టీ20 తరహాలో బ్యాట్ రేటింగ్ చేశాడు. రిషబ్ పంత్ వరల్డ్ వైడ్గా అనేక క్లిష్టమైన మైదానాల్లో టీమిండియా కోసం అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు చేశాడు. రిషబ్ పంత్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో టెస్టు సెంచరీలు సాధించి అత్యుత్తమ ప్రతిభను చాటాడు.