EPAPER

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Paralympics Hokato Hotozhe| ఒలింపిక్స్ లో జరగని అద్భుతాలు భారత దేశం కోసం పారాలింపిక్స్ లో జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి (సెప్టెంబర్ 6, 2024)న పారిస్ పారాలింపిక్స్ పోటీల్లో ఇండియా ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. లాంగ్ జంప్ పోటీల్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ బంగారు పతకం సాధించగా.. షాట్ పుట్ పోటీల్లో మాజీ ఆర్మీ ఆఫీసర్ హొకాటో హోటోజె సెమా కాంస్య పతకం సాధించారు.


లాంగ్ జంప్ పోటీల్లో ప్రవీణ్ కుమార్ ఒక సూపర్ జంప్ చేశాడు. ఏషియన్ గేమ్స్ లో తను సాధించిన రికార్డ్ ని తనే బద్దలు కొట్టాడు. పారిస్ పారాలింపిక్స్ లో హై జంప్ పోటీల్లో ఆరుగురు అథ్లెట్లతో పోటీ పడుతూ 2.08 మీటర్ల బెస్ట్ జంప్ చేసి ప్రవీణ్ కుమార్ కొత్త రికార్డ్ ని సృష్టించాడు. పోడియంలో టాప్ పొజిషన్ ని కైవసం చేసుకున్నాడు. పుట్టుకతో ఒక కాలు చిన్నగా ఉన్న ప్రవీణ్ కుమార్ పారిస్ పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు.

మరోవైపు భారత్ మాజీ ఆర్మీ ఆఫీసర్ హొకాటో హోటోజె సెమా షాట్ పుట్ త్రో పోటీల్లో 14.65 మీటర్ల్ బెస్ట్ త్రో చేశాడు. F57 క్లాస్ షాట్ పుట్ పోటీల్లో సెమా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఈ రెండు పతకాలతో భారత్ సాధించిన మొత్తం మెడల్స్ సంఖ్య 27 కు చేరింది.


పారాలింపిక్స్ పోటీల్లో తొలిసారి పోటీ చేసిన హొకాటో హోటోజె సెమా(40) .. భారత సైన్యంలో ఆర్మీ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తూ.. 2002లో ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్ లో తన కాలుని కోల్పోవాల్సి వచ్చింది. అయిన ఆయన ధైర్యం కోల్పోలేదు. 32 ఏళ్ల వయసులో షాట్ పుట్ క్రీడను ఎంచుకొని ఏషియన్ పారా గేమ్స్ 2023లో 13.94 మీటర్ల త్రో చేసి కాంస్య పతకం సాధించాడు. 2023లో ప్రపంచ షాట్ పుట్ పోటీల్లో హొకాటో పాల్గొని ఏడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు హొకాటో హోటోజె సెమా తన దేశం కోసం పారిస్ పారాలింపికక్స్ లో కాంస్య పతకం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో

భారత్ మెడల్స్ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. శనివారం దలీప్ గావిత్ ఇండియా తరపున పురుషులు 400 మీటర్ల రన్నింగ్ పోటీల్లో పాల్గొననున్నాడు. గావిత్ ఇంతకుముందు 2022 ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించాడడంతో ఈసారి పారిస్ పారాలింపిక్స్ లో అందరి చూపు ఆయనపై నే ఉంది.

ఇవే కాకుండా పురుషుల మెన్స్ జావెలిన్ త్రో F41లో భారత్ తరపున నవదీప్ ఉన్నాడు. మహిళల 200 మీటర్ల రన్నింగ్ పోటీల్లో సిమ్రన్ కూడా ఉంది. ఇంకా పారా సైక్లింగ్, పారా కెనో, పారా స్విమ్మింగ్ పోటీల ఫైనల్స్, సెమీ ఫైనల్స్ పోటీలకు భారత క్రీడా కారులు అర్హత సాధించారు. వీరందరూ పోటీతత్వం చూస్తుంటే.. ఈ సారి పారాలింపిక్స్ లో ఇండియా హై లైట్ కావడం ఖాయమనిపిస్తోంది.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×