MS Dhoni : గత 15 సంవత్సరాల నుంచి ఎమ్ఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ అమాంతం పెరుగుతూ ఉందే తప్ప తగ్గడంలేదు. ఓ చిన్నారి అడిగిన ప్రశ్నలకు మాజీ టీంఇండియా క్యాప్టెన్ చెప్పిన సమాధానాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తాను పదవ తరగతి పాస్ అవుతానో లేదోనని తన తండ్రి చాలా భయపడేవాడని అన్నారు. చివరగా టెన్త్ పాస్ కావడంతో ఆయన చాలా సంతోషించినట్లు చెప్పారు.
ఏడవ తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్గా మారినట్లు ధోని చెప్పారు. ఆ సమయంలో క్రికెట్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అటెండెన్స్ చాలా తక్కువైందన్నాడు. పదవ తరగతిలో కేవలం 66 శాతం మార్కులతోనే పాస్ అయినట్లు చెప్పాడు. ఇంటర్లో 56 శాతం మార్కులు మాత్రమే వచ్చినట్లు బయటపెట్టాడు. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటని విద్యార్ధిని అడిగినప్పుడు.. క్రికెట్ను సబ్జెక్ట్గా ఒప్పుకుంటారా అని తిరిగి ప్రశ్నించాడు. విద్యార్ధులతో ధోని ముచ్చటించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.