Paris Olympics PV Sindhu registers dominant win: పారా ఒలింపిక్స్ లో భాగంగా మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు సత్తా చాటుతుంది. ఈ మేరకు గ్రూప్ స్టేజీలో నిర్వహించిన మహిళల సింగ్స్ రెండో రౌండ్లో పీవీ సింధు విజయం సాధించింది. ఎస్తోనియా దేశానికి చెందిన క్రిష్టినా కుబాపై గెలుపొందింది. 21-5, 21-10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సింధు రౌండ్ 16 ఫ్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు.
ఈ మ్యాచ్ కేవలం 32 నిమిషాల్లోనే ముగిసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే పీవీ సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లలోనూ మాల్దీవులకు చెందిన ఫాతిమా అబ్దుల్ రజాక్ పై విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. 2016లో రియో గేమ్స్ లో రజత పతకం, టోక్యోలో జరిగిన గత ఎడిషన్ లో కాంస్యం సాధించింది.
Also Read: సంజూ శాంసన్ కి ఏమైంది?
తొలి గేమ్ లో క్రిస్టినా ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అయితే రెండో గేమ్ ప్రారంభమైన కాసేపు ధీటుగా పోటీ ఇచ్చింది. ఆ తర్వాత సింధు పుంజుకొని ఎక్కువ పాయింట్లు సాధించింది. ఈ గేమ్ ప్రారంభం నుంచి సింధు ఎక్కడా కూడా ఏకాగ్రత కోల్పోలేదు. క్రిస్టినాకు కనీసం అవకాశం ఇవ్వకుండా గేమ్ ను పూర్తి చేసింది.