Sports Minister Mandaviya credits Khelo India for Manu Bhaker’s bronze win: దేశంలో ఇంటా బయాట యువ షూటర్ మనుబాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 10 మీ ఎయిర్ పిస్టల్ లో కాంస్య పతకం సాధించి.. భారతదేశానికి తొలిపతకం అందించిన క్రీడాకారిణిగా పేరు ప్రఖ్యాతులు పొందింది.
అయితే రాబోవు రోజుల్లో మను బాకర్ కోచ్ గా మారి, తను విదేశాల్లో నేర్చుకున్న శిక్షణనంతా తన తర్వాత తరానికి నేర్పించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పుడు భారతదేశం ఖేలో ఇండియా ద్వారా క్రీడలపై పెట్టుబడి పెడుతోంది. ఫలితాలు నేడు కాకపోయినా, రేపు అయినా వస్తాయని తెలిపారు.
ఇదంతా ప్రధాని మోదీ ప్రారంభించిన ‘ఖేలో ఇండియా’ పథకంలో భాగంగా జరిగిందని అన్నారు. అందుకే మను బాకర్ శిక్షణ కోసం ఎప్పుడూ లేనట్టుగా రూ.2 కోట్లు పైనే ఖర్చు చేసినట్టు తెలిపారు. శిక్షణ కోసం జర్మనీ, స్విట్లర్లాండ్ వెళ్లింది. అంతేకాదు తనకి కావల్సిన కోచ్ ను నియమించుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాం. ఎక్కడా బలవంతపు రుద్దుడు లేదని తెలిపారు.
Also Read: ఒలింపిక్స్ లో నేటి భారత షెడ్యూల్ ..
తను విదేశాలకు వెళతానంటే ఆ ఖర్చులు భరించామని అన్నారు. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని తెలిపారు. ఈసారి వెళ్లినవాళ్లందరూ అలాంటి శిక్షణ పొందిన వారేనని తెలిపారు. మరికొన్ని పతకాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం గెలిచాక మళ్లీ 12 ఏళ్ల తర్వాత మను బాకర్ కాంస్యం గెలిచి భారత పతాకం రెపరెపలాడింది.
కేంద్ర క్రీడాశాఖా మంత్రి మాట్లాడుతూ ఖేలో ఇండియాలో భాగంగా భారతదేశంలో క్రీడాకారులకు సౌకర్యలు మెరుగైనట్టు తెలిపారు. అలాగే పాఠశాలలు, కళాశాలలు, గ్రామ స్థాయి నుంచి క్రీడాకారుల్లో నైపుణ్యాలను గుర్తించే కార్యక్రమం మొదలైందని తెలిపారు. వారికి తగిన శిక్షణిచ్చి రాటు దేలిన తర్వాత, అకాడమీలకు తీసుకువెళుతున్నట్టు తెలిపారు. అన్నిటికి మించి ఆటగాళ్లకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు.