Big Stories

IPL : చివరి మ్యాచ్ లో ముంబై విక్టరీ.. హైదరాబాద్ చిత్తు..

IPL : ముంబై తన చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (14) త్వరగా అవుటైనా కెప్టెన్ రోహిత్ శర్మ ( 56), కామోరూన్ గ్రీన్ (100 ) చెలరేగి ఆడారు. రెండో వికెట్ కు 128 పరుగులు జోడించారు.

- Advertisement -

రోహిత్ పెవిలియన్ చేరిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ (25) అదే జోరు కొనసాగించాడు. దీంతో ముంబై 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మయాంక్ డగర్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ (69), మయాంక్ అగర్వాల్ ( 83) తొలి వికెట్ కు 140 పరుగులు జోడించారు. దీంతో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఆకాశ్ మద్వాల్ 4 వికెట్లు తీశాడు. క్రిస్ జోర్డాన్ కు ఒక వికెట్ దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News