Ms Dhoni: చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో ధోనీ సేన విజృంభించింది. లక్నోపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది. చివరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోని మొదటి బంతినే స్టాండ్స్ లోకి పంపించాడు. అలాగే రెండో బంతిని కూడా భారీ సిక్సర్గా మలిచాడు. వరుసగా రెండు సిక్సులు బాదడంతో స్టేడియం మొత్తం ధోనీ.. ధోనీ నినాదాలతో మారుమ్రోగిపోయింది. అభిమానులు రచ్చ రచ్చ చేశారు.
ధోని రెండు సిక్సర్లు బాధిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇకపోతే ఈ మ్యాచ్తో ధోని అరుధైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 5000 పరుగులు చేసిన ఏడో బ్యాటర్గా, ఐదో భారత క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఈ ఘనత సాధించిన వారిలో 6,706 పరుగులతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా.. శిఖర్ ధావన్ 6,086 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఏబీ డెవిల్లియర్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.