MS Dhoni: క్రికెట్ ఫ్యాన్స్కు ఇక నుంచి పండుగే పండుగ. ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. మార్చి 31నుంచి ప్రారంభం కానుంది. హాట్ సమ్మర్లో కూల్గా మ్యాచ్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఈ సీజన్ మరింత జోరుగా సాగనుంది. అభిమానుల ఫోకస్ అంతా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీపైనే ఉంది. ఎందుకంటే ఇదే అతని చివరి సిరీస్ కాబట్టి.
ఇకపోతే మొదటి రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఇరుజట్లు ప్రాక్టీస్ సెషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నాయి. సోమవారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు ప్రాక్టీస్ చేశారు. ఈక్రమంలో వారిని చూసేందుకు అభిమానులకు అనుమతిచ్చారు. తమకు ఇష్టమైన ప్లేయర్లను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఫ్యాన్స్తో స్టేడియం అంతా కిక్కిరిసిపోయింది.
ధోని స్టేడియంలోకి అడుగుపెట్టగానే అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ధోనీ.. ధోనీ.. అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ధోనీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్లు చేస్తున్నారు.