EPAPER

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు కివీస్?.. గ్రూప్ -1 లో రెండో బెర్త్ ఎవరికి ?

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు కివీస్?.. గ్రూప్ -1 లో రెండో బెర్త్ ఎవరికి ?

20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకుంది. చివరి మ్యాచ్ లో ఐర్లాండ్ పై 35 పరుగుల తేడాతో కివీస్ గెలిచింది. లీగ్ దశలో 5 మ్యాచ్ ల్లో 3 విజయాలు నమోదు చేసింది కివీస్ జట్టు.. మరో మ్యాచ్ లో పరాజయం పొందింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టు సెమీస్ చేరడం దాదాపు ఖాయమైంది.


ఆడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 185 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెలరేగి ఆడాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 32 పరుగులు, మిచెల్ 31 పరుగులు, కాన్వే 28 పరుగులు చేసి జట్టు భారీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ బౌలర్ లిటిల్ సంచలన ప్రదర్శన చేశాడు. 19వ ఓవర్ లో హ్యాట్రిక్ సాధించాడు. వరుస బంతుల్లో విలియమ్సన్ , నీషమ్ , సాంట్నర్ ను అవుట్ చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 185 పరుగులు స్కోర్ సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దీంతో ఆ జట్టు 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 68 పరుగులు సాధించింది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ 37 పరుగులు, బాల్ బైర్న్ 30 పరుగులు చేసి వెంటవెంటనే అవుటయ్యారు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్ద స్కోర్లు సాధించలేదు. దీంతో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో పెర్గూసన్ 3 వికెట్లు తీయగా సాంట్నర్, సోధి, సౌతీ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు.

సెమీస్ కు చేరే జట్లేవి?
లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు ఆడిన కివీస్ ఖాతాలో 7 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు రన్ రేట్ 2.113 ఉంది. సెమీస్ రేసులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక పోటీలో ఉన్నాయి. ఆస్ట్రేలియా ..ఆఫ్గానిస్థాన్ పై విజయం సాధిస్తే అప్పుడు ఆసీస్ ఖాతాలోకి 7 పాయింట్లు వస్తాయి. అయితే ఆ జట్టు రన్ రేట్ మైనస్ లో ఉంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ భారీతో తేడాతో గెలవాలి. ఇక ఈ గ్రూపులో చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్-శ్రీలంక తలపడతాయి. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే ..కివీస్ తో సమానంగా 7 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్ చేరతాయి. ఈ లెక్కల ప్రకారం కివీస్ ముందంజలో ఉంది. చివరి మ్యాచ్ లో నెగ్గితే ఇంగ్లండ్ కు మెరుగైన అవకాశాలుంటాయి. ఇంగ్లండ్- శ్రీలంక మ్యాచ్ ఫలితంపైనే ఆసీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అంటే రెండో సెమీస్ బెర్త్ ఖరారు కావాలంటే చివరి లీగ్ మ్యాచ్ వరకు ఆగాల్సిందే.


Related News

Telangana: విమోచనం.. విలీనం.. విద్రోహం.. ప్రజా పాలనా దినం..! 2014 నుంచి 2024 దాకా..!

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం.. సాయుధ పోరాటం..!

YS Jagan Mohan Reddy: జగన్ కాదు.. సీతయ్య.. వైసీపీలోనే గుసగుసలు

New Headache To YS Jagan: జగన్‌కు కొత్త తలనొప్పి.. కనక దుర్గ కండిషన్స్

New Election Commissioner: తెలంగాణ కొత్త ఎలక్షన్ కమీషనర్.. ఎవరంటే?

Big Shock to YS Jagan: వైసీపీ అడ్రస్ గల్లంతు.. 45 కార్పోరేటర్లు టీడీపీలోకి?

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

Big Stories

×