EPAPER

Ms Dhoni: ఐపీఎల్ 2025 నుంచి ధోని ఔట్..CSK యాజమాన్యం కీలక ప్రకటన ?

Ms Dhoni: ఐపీఎల్ 2025 నుంచి ధోని ఔట్..CSK యాజమాన్యం కీలక ప్రకటన ?

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) టోర్నమెంట్ కోసం అన్ని జట్లు సంసిద్ధమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే కీలక ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni ).. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడడం పైన అందరిలోనూ సందేహంగా ఉంది. అసలు మహేంద్రసింగ్ ధోని ఐపిఎల్ 2025 టోర్నమెంట్ ఆడతాడా? లేదా? కేవలం మెంటల్ గా ఉంటారా ? అనే సందేహాలు కూడా చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి.


IPL 2025 CSK CEO Kasi Viswanathan Breaks Silence On The MS Dhoni

వచ్చే సీజన్ లో కచ్చితంగా ధోని ( MS Dhoni ) ఆడతాడని… ఈసారి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా మహేంద్ర సింగ్ ధోని బరిలోకి దిగబోతున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆయన కోసమే బిసిసిఐ కూడా కొత్త రూల్స్ తీసుకు వచ్చిందని.. ఈసారి అన్ క్యాప్డ్ రూల్ కూడా మహేంద్ర సింగ్ ధోనీ కోసం తెచ్చిందేనని… కొంతమంది అంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో… చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings ) యాజమాన్యం కీలక ప్రకటన చేసింది.

Also Read: India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !


మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ 2025 టోర్నమెంటులో ఆడడం పైన… చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశి విశ్వనాధ్ (Kashi Vishwanath).. సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని… ఐపీఎల్ 2025 ఒక్క సీజన్… ఆడితే.. బాగుంటుందని… ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క సీజన్ ఆడి… రిటైర్ అయిన పర్వాలేదని.. కాశీ విశ్వనాథ్ కోరారు. కానీ మహేంద్రసింగ్ ధోని… దీనిపై ఇంకా స్పందించలేదని ఆయన వెల్లడించారు.

Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

తాము మహేంద్రసింగ్ ధోని ( MS Dhoni ) ఆన్సర్ కోసం వేచి చూస్తున్నామని కూడా ఆయన వివరించడం జరిగింది. ఇప్పటివరకు మహేంద్ర సింగ్ ధోని తమకు అందుబాటులోకి రాలేదని కూడా ఆయన పేర్కొన్నారట. అక్టోబర్ 31వ తేదీ లోపు రిటెన్షన్ లిస్టును కచ్చితంగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని 10 ఫ్రాంచైజీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే తమ… రిటెన్షన్ ప్లేయర్ల లిస్టును… రెడీ చేసుకున్నాయి 10 ఫ్రాంచైజీలు.

Also Read: ICC Womens T20 World Cup: నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ ఫైట్‌..

ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… ధోని విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మహేంద్ర సింగ్ ధోని గ్రీన్ సిగ్నల్ ఇస్తే…. అతని మళ్లీ తీసుకునేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే కాశీ విశ్వనాథ్ తాజాగా ప్రకటన చేశారు. అక్టోబర్ 31వ తేదీకి కేవలం 10 రోజులే సమయం ఉంది. ఆ లోపు మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni ) స్పందిస్తారని కొంతమంది అంటున్నారు.

Related News

Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !

India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !

IND vs NZ: బెంగళూరు టెస్ట్‌కు వర్షం అంతరాయం..ఇంకా ప్రారంభం కానీ మ్యాచ్ !

ICC Womens T20 World Cup: నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ ఫైట్‌..

Ind vs Pak: పాకిస్తాన్ పై.. టీమిండియా గ్రాండ్ విక్టరీ

Rishabh Pant: ఏడోసారి 90లో ఔట్… రిషబ్ పంత్‌ కు ఆరేళ్లుగా ఇదే తంతూ!

Big Stories

×