Boxing Day Test: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించి వన్డే సిరీస్ను గెలుచుకుని టెస్టు సిరీస్కు సిద్ధమవుతోంది. 2 మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి టెస్టు డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా జరగాల్సి ఉంది. సాధారణంగా క్రికెట్లో క్రిస్మస్కు తర్వాతి రోజున మొదలుకాబోయే బాక్సింగ్ డే టెస్టులో సఫారీతో కఠిన సవాల్ను స్వీకరించనుంది.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి కామన్వెల్త్ దేశాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన బాక్సింగ్ డే టెస్టులు ఇటీవల కాలంలో భారత్లో కూడా పాపులర్ అవుతున్నాయి. టీమిండియా మొట్టమొదటిసారిగా 1985లో బాక్సింగ్ డే టెస్టు ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ను భారత్ డ్రా చేసుకుంది. ఇప్పటివరకూ భారత్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లతో 16 బాక్సింగ్ డే టెస్టులు ఆడింది. ఆస్ట్రేలియాతో 9, సౌతాఫ్రికాతో 6, న్యూజిలాండ్తో ఒక టెస్టు ఆడింది.
1985 నుంచి బాక్సింగ్ డే టెస్టులు ఆడుతున్న భారత్.. ఇప్పటివరకూ గెలిచింది నాలుగు మ్యాచ్లు మాత్రమే. అది కూడా టీమిండియా తొలి బాక్సింగ్ డే టెస్టు విజయం సౌతాఫ్రికా మీదే కావడం గమనార్హం. 2010లో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్.. సఫారీలను ఓడించి తొలి విజయాన్ని నమోదుచేసింది. కానీ 2018 నుంచి ఆడిన మూడు బాక్సింగ్ డే టెస్టులలో భారత్దే విజయం. 2018, 2020లలో ఆస్ట్రేలియాను ఓడించిన కోహ్లీ సేన.. 2021లో కూడా ప్రోటీస్ టీమ్ను ఓడించింది. త్వరలో రోహిత్ శర్మ సారథ్యంలో మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. తొలి టెస్టు జరుగబోయే సెంచూరియన్లోనే చివరిసారిగా బాక్సింగ్ డే టెస్టును గెలుచుకుంది. మొత్తంగా సౌతాఫ్రికాపై ఆరు టెస్టులు ఆడి రెండు గెలిచి నాలుగింటిలో ఓడింది.