India won by 7 wickets: బంగ్లాదేశ్ జట్టుపై టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా జట్టు.. టి20 లోను కూడా మంచి ఆరంభాన్ని అందుకోవడం జరిగింది. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా మొదటి టి20 మ్యాచ్ లో విజయం సాధించింది సూర్య కుమార్ సేన. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో.. బరిలోకి దిగిన టీమిండియా జట్టు బంగ్లాదేశ్ పైన ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా అదిరిపోయే బ్యాటింగ్ చేయడంతో.. అవలీలగా ఇండియా మ్యాచ్ నెగ్గింది.
Also Read: Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?
ఈ మొదటి టి20 మ్యాచ్ లో.. మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆల్ అవుట్ అయింది. బంగ్లాదేశ్ లో హసన్, శాంటో తప్ప ఎవరు రాణించలేదు. అటు టీమిండియా బౌలర్లలో… హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో ముగ్గురిని.. పెవిలియన్ కు పంపాడు.
Also Read: IPL 2025: ఐపీఎల్ రిటెన్షన్ రూల్పై కొత్త పంచాయితీ…చిక్కుల్లో ఓనర్లు?
కొత్త కుర్రాడు మా యాంకర్ యాదవ్ కు ఒక వికెట్ పడింది. వాషింగ్టన్ సుందర్ కూడా ఒక వికెట్ తీయగలిగాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. 11.5 ఓవర్లలోనే.. లక్ష్యాన్ని చేదించింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. సంజు సాంసన్ 29, సూర్య కుమార్ యాదవ్ 29, హార్దిక్ పాండ్యా 39 పరుగులు చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 9వ తేదీన రెండో టి20 మ్యాచ్ జరిగింది.