EPAPER

Bangladesh : బంగ్లాదేశ్ పై భారత్ జయభేరి..ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో గెలుపు

Bangladesh : బంగ్లాదేశ్ పై భారత్ జయభేరి..ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో గెలుపు

Bangladesh : టీ20 వరల్డ్ కప్ లో భారత్ మూడో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్ తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో డక్ వర్త లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో విఫలమైన రాహుల్ ఫామ్ లోకి వచ్చాడు. కీలకపోరులో హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లీ తన భీకర ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి చెలరేగాడు. విరాట్ 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. సూర్యకుమార్ కూడా 30 పరుగులతో మెరుపులు మెరిపించాడు.


185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్ లిట్టన్ దాస్ చెలరేగడంతో పవర్ ఫ్లేలో 6 ఓవర్లలోనే 66 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత వర్షం మ్యాచ్ కు ఆటంకం కలిగించడంతో బంగ్లాదేశ్ కు 16 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. వర్షం తర్వాత భారత్ బౌలర్లు చెలరేగారు. ప్రమాదకరంగా మారిన లిట్టన్ దాస్ 60 పరుగులు చేసి రనౌట్ కావడంతో రోహిత్ సేన మ్యాచ్ పై పట్టు సాధించింది. అయితే చివరిలో వికెట్ కీపర్ నురల్ హసన్ భారత్ ను భయపెట్టాడు. చివరి ఓవర్ ను అర్షదీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ కు చేరువైంది.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×