INDIA vs BAN : భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆఖరి టీ20 సమరంలో టీమిండియా రెచ్చిపోయింది. ప్రత్యర్థి బంగ్లాపై విరుచుకుపడింది. కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. హైదరాబాద్ ఉప్పల్’లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న చివరి టీ20లో భారత బ్యాట్స్ మెన్లు బంగ్లా బౌలర్లను ఊచకోత కోశారు.
అంతర్జాతీయ టీ20 చరిత్రలోనే రెండో అతిభారీ స్కోర్ నమోదు చేసింది టీమిండియా. సంజూ శాంసన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర విన్యాసాలకు, సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు తొడవడంతో స్కోర్ బోర్డు దూసుకెళ్లింది. ఇన్నింగ్స్ చివర్లో హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; ఫోర్, 4 సిక్సర్లు) ఫలితంగా ఆల్ టైమ్ రికార్డు స్కోరు నమోదైంది. 13 ఓవర్లు ముగిసే సరికే భారత్ స్కోరు 190 దాటి ఔరా అనిపించింది. ఒకదశలో టీమ్ స్కోరు 300 పక్కాగా దాటి టీ20ల్లో సరికొత్త హిస్టరీ క్రియేట్ అవుతుందా అని అనిపించింది.
ఇప్పటి వరకు టీ20ల్లో రికార్డులు బద్దలుకొట్టిన జట్ల వివరాలివే…
1. నేపాల్ 314/3 vs మంగోలియా-2023
2. భారత్ 297/6 vs బంగ్లాదేశ్ – 2024
3. అఫ్గానిస్తాన్ 278/3 vs ఐర్లాండ్-2019
4. జెచ్ రిపబ్లిక్ 2784 టర్కీ-2019
5. మలేషియా 268/4 vs థాయిలాండ్ – 2023
6. ఇంగ్లాండ్ 267/3 vs వెస్టిండీస్ – 2023
7. ఆస్ట్రేలియా 263/3 vs శ్రీలంక – 2016
8. శ్రీలంక 260/6 vs కెన్య – 2007
9. భారత్ 260/5 vs శ్రీలంక – 2017
10. దక్షిణాఫ్రికా 259/4 vs వెస్టిండీస్ – 2023