ఈ నేపథ్యంలో ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇందుకోసం 15మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎప్పటిలా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ కాగా, స్మ్రతి మంధాన వైస్ కెప్టెన్ గానే ఉన్నారు.
ఇటీవల కొత్తగా ఎంపిక చేస్తున్న ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉమా ఛెత్రి, తనుజా కన్వర్, సైమా ఠాకూర్ ఉన్నారు. టీ 20 మెన్ ప్రపంచకప్ సందర్భంగా ఇలాగే తొలిసారి ఎంపిక చేశారు. అందులో శుభ్ మన్ గిల్, రింకూ సింగ్ తదితరులున్నారు. ఇకపోతే వికెట్ కీపర్ యాస్తికా భాటియా, ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ ఇద్దరికి గాయాలు తగ్గిపోతే జట్టులో కలుస్తారని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. అయితే వారిద్దరూ ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.
బంగ్లాదేశ్ లో జరుగుతున్న గొడవల కారణంగా వేదికను బీసీసీఐ యూఏఈకి మార్చింది. ఈ మహిళా టీ 20 ప్రపంచకప్ లో రెండు గ్రూప్ లు ఉంటాయి. ఏ గ్రూప్ లో 5 జట్లు, బీ గ్రూప్ లో 5 జట్లు ఉంటాయి. ఆ గ్రూప్ లో ఉన్న జట్లు మిగిలిన జట్లతో ఒకొక్క మ్యాచ్ ఆడుతుంది. అలా అక్కడ టాప్ 2 లో ఉన్న జట్లు.. రెండు గ్రూపుల నుంచి సెమీస్ కి చేరతాయి. తర్వాత అక్కడ గెలిచిన వాళ్లు ఫైనల్ ఆడతారు.
Also Read: అర్రెర్రె.. ధావన్ భయ్ ఎంత పనిచేశావ్? మళ్లీ క్రికెట్ ఆడతావా?
ఏ గ్రూప్ లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక ఉన్నాయి. బీ గ్రూప్ లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. అయితే, ఏ గ్రూప్ లో ఉన్న భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబరు 6న దుబాయ్ లో జరగనుంది. అక్టోబరు 17, 18 మధ్య సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబరు 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మూడు మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉంది.
టీ 20 ప్రపంచకప్ నుకు ఎంపికైన అమ్మాయిల జట్టు ఇదే: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మ్రతి మంధాన ( వైస్ కెప్టెన్), దీప్తీ శర్మ, షఫాలీ వర్మ, రిచాఘోష్, జేమీమా రోడ్రిగ్స్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, ఆశా శోభన, హేమలత, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, సంజనా సంజీవన్ ఉన్నారు.