Ind Vs Nz: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరు వేదిక మొదటి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా కు ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించినప్పటి నుంచి వికెట్లన్నీ వరుసగా రాలిపోయాయి. ఏ ఒక్కరు గ్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో టీమిండియా 46 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మొత్తం కుప్పకూలింది.
వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక్కడే 20 పరుగులు చేసి రాణించాడు. మిగతా ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా సరిగా ఆడలేదు. ఈ మ్యాచ్లో… అది విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్.. ఈ ప్లేయర్ లందరూ డక్ అవుట్ అయ్యారు. మిగతా ప్లేయర్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.
Also Read: IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్స్టార్లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?
వాస్తవంగా ఇవాళ… ఉదయం వర్షం తగ్గ ముఖం పట్టిన తర్వాత టాస్ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా టాస్ నెగ్గిన టీమిండియా… మొదట బ్యాటింగ్ తీసుకుంది. అయితే బంగ్లాదేశ్ పైన ఆడినట్లుగానే టీమిండియా ఆడుతుందని అందరూ అనుకున్నారు. కానీ బ్యాటింగుకు దిగిన టీమిండియా వరుసగా వికెట్లను పోగొట్టుకుంది. మొదటగా రోహిత్ శర్మ రెండు పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Also Read: IPL 2025: అంబానీ బిగ్ స్కెచ్.. ముంబై ఇండియన్స్కు కొత్త కోచ్ నియామకం.!
ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీ అటు సరఫరాజ్ ఖాన్… ఇద్దరు జీరో కు అవుట్ అయ్యారు. ఆ తర్వాత పంతు 20 పరుగులు చేయగలిగాడు. యశస్వి జైస్వాల్ 13 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్ ఏదో పని ఉన్నట్లుగానే గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయారు. ఈ ముగ్గురు బ్యాట్స్మెన్లు కూడా జీరో కు అవుట్ అయ్యారు. అటు బౌలర్లు.. కూడా బ్యాటింగ్ చేయలేక చేతులు ఎత్తేశారు. దీంతో టీమ్ ఇండియా 46 పరుగులకు ఆల్ అవుట్ కావడం జరిగింది. టీమిండియా చరిత్రలోనే ఇది తొలిసారి. ఇంత తక్కువ పరుగులకు టీమిండియా ఎప్పుడు ఆల్ అవుట్ కాలేదు.