India win toss, opt to bat against Zimbabwe in 2nd T20I: జింబాబ్వే, భారత్ మధ్య అయిదు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ను ఎంచుకున్నది.
టీమిండియా ప్లేయర్స్: అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, శుభ్మన్ గిల్, రింకు సింగ్, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్
జింబాబ్వే ప్లేయర్స్: వెస్లీ మాధవెరె, ఇన్నోసెంట్ కయా, బన్నెట్, సికందర్ రాజా, డియాన్ మైర్, కంప్బెల్, క్లీవ్ మాడండే, విల్లింగ్టన్, లుక్ జాంగ్వే, బ్లెస్సింగ్ ముజరబ్బానీ, టెండాయి చతరా
Also Read: బ్రేకింగ్ న్యూస్.. రాహుల్ ద్రవిడ్కు భారత రత్న..?
ఇదిలా ఉంటే.. తొలి టీ20లో జింబాబ్వే చేతిలో టీమిండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. మరుసటి రోజైన నేడు రెండో మ్యాచ్ జరుగుతుంది. అయితే, జింబాబ్వే బౌలర్లను టీమిండియా ఆటగాళ్లు తేలికగా తీసుకున్నారో.. లేదా పిచ్ ను సరిగా అంచనా వేయలేకపోయారో.. తెలియదు గానీ.. మొదటి మ్యాచ్ లోనే భారత ఆటగాళ్లు తేలిపోయారు. ఐపీఎల్ లో అదరగొట్టిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, రుతురాజ్, రింకు సింగ్ ఈసారి తీవ్రంగా నిరాశపరిచారు. ఈ మ్యాచ్ లో వీళ్లంతా సత్తా చాటుతారంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.