EPAPER

Srilanka: భారత్‌కు షాకిచ్చి టైటిల్‌ను సొంతం చేసుకున్న శ్రీలంక

Srilanka: భారత్‌కు షాకిచ్చి టైటిల్‌ను సొంతం చేసుకున్న శ్రీలంక

Women’s Asia Cup T20 2024: భారత్ కు శ్రీలంక షాకిచ్చింది. మహిళల ఆసియా కప్ తుది పోరులో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ ను సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు తీసింది. ఈ లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 8 బంతులు మిగిలుండగానే విజయాన్ని ఛేదించి కప్ కైవసం చేసుకుంది. శ్రీలంక జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు 61 పరుగులు తీయగా, హర్షిత సమర విక్రమ 69 పరుగులు తీసింది. కవిషా దిల్హరి 30 పరుగులతో రాణించింది.


Also Read: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

ఇటు భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (60- 47 బంతుల్లో 10 ఫోర్లు) అద్భుతంగా అదరగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (29 – 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), రిచా ఘోష్ (23- 9 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు తీశారు. అయితే, షపాలీ వర్మ 16 పరుగులు, ఉమా ఛెత్రి 9, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ – 11 పరుగులు తీసి నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో కవిషా 2 వికెట్లు తీయగా, సచిని నిశంసల, చమరి ఆటపట్టు తలో వికెట్ తీశారు.


Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×