Women’s Asia Cup T20 2024: భారత్ కు శ్రీలంక షాకిచ్చింది. మహిళల ఆసియా కప్ తుది పోరులో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ ను సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు తీసింది. ఈ లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 8 బంతులు మిగిలుండగానే విజయాన్ని ఛేదించి కప్ కైవసం చేసుకుంది. శ్రీలంక జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు 61 పరుగులు తీయగా, హర్షిత సమర విక్రమ 69 పరుగులు తీసింది. కవిషా దిల్హరి 30 పరుగులతో రాణించింది.
Also Read: పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం
ఇటు భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (60- 47 బంతుల్లో 10 ఫోర్లు) అద్భుతంగా అదరగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (29 – 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), రిచా ఘోష్ (23- 9 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు తీశారు. అయితే, షపాలీ వర్మ 16 పరుగులు, ఉమా ఛెత్రి 9, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ – 11 పరుగులు తీసి నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో కవిషా 2 వికెట్లు తీయగా, సచిని నిశంసల, చమరి ఆటపట్టు తలో వికెట్ తీశారు.