IND vs AUS: ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని భారత్ 39.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. కేఎల్ రాహుల్ (75*), రవీంద్ర జడేజా(45*) పరుగులు చేసి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. 188 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 81 పరుగులు చేయగా.. ఇంగ్లిస్ 26, స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశారు. ఇక టీమిండియా బౌలర్లు మహమ్మద్ షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీయగా… రవీంద్ర జడేజా 2, కుల్దీప్, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు.
Insurance: లవర్స్ మీ కోసమే ఇది.. హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్
Crime: యువతుల మధ్య ప్రేమ.. మధ్యలోకి అబ్బాయి ఎంట్రీ.. చివరికి..