IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు చుక్కలు చూపించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 177 పరుగులకే ఆల్ఔట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(20) ఆసిస్ పేసర్ మార్ఫీ చేతిలో కాట్ అండ్ బౌల్ అయ్యాడు.
రోహిత్ శర్మ(50*) దాదాపు రెండేళ్ల తర్వాత ఆఫ్ సెంచరీ చేశాడు. క్రీజ్లో రోహిత్తో పాటు రవిచంద్రన్ ఉన్నారు. విరాట్, సూర్యకుమార్ యాదవ్, ఛతేశ్వర్ పుజారా, భరత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. భారత బౌలర్లు జడేజా 5 , అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, సిరాజ్ తలో వికెట్ తీశారు. ఇక 100 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ రెండో రోజు ఓపికగా.. అవసరమున్న చోట దూకుడు ప్రదర్శిస్తే ఆ పరుగులు చేయడం కష్టమేమీ కాదు.