IND vs AUS: ఆస్ట్రేలియాతో జరగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. 163 పరుగులకే ఆలౌటయ్యారు. ఆస్ట్రేలియా లక్ష్యం 76 పరుగులుగా నిర్దేశించారు. ఛేతేశ్వర్ పుజారా (59) పరుగులతో రాణించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 26, రోహిత్ శర్మ 12, శుభ్మన్ గిల్ 2, విరాట్ కోహ్లీ 13, అశ్విన్ 16 పరుగులు మాత్రమే చేశారు.
ఆసీస్ బౌలర్లు నాథన్ లైయన్ ఎనిమిది వికెట్లు తీసి చెలరేగిపోయాడు. అలాగే మిచెల్ స్టార్క్, కునెమన్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సమయం లేకపోవడంతో ఆటను నిలిపివేశారు. బుధవారం ఉదయం తిరగి గేమ్ మొదలుకానుంది.