ఎందుకింత తక్కువ ధర పెట్టాల్సి వచ్చిందంటే.. యూఏఈలో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు నివసిస్తున్నారు. అందువల్ల వారందరూ తమ దేశం ఆడేటప్పుడు వచ్చి మద్దతు తెలియచేసేందుకు వీలుగా తక్కువ ధర పెట్టినట్టు ఐసీసీ తెలిపింది. ఇక అన్నింటికి మించి 18ఏళ్లలోపు యువతకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సరదాగానైనా వచ్చి క్రికెట్ మ్యాచ్ లు చూస్తారని, స్టేడియంలు కళకళలాడతాయని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఇకపోతే టోర్నీలో పాల్గొనే మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉంటే, గ్రూప్ బీలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. ఏ విధంగా ఆడతారంటే.. టీ 20 మెన్స్ ప్రపంచకప్ ఆడినట్టుగానే ఒక గ్రూప్ లో ఉన్న ఐదు జట్లతో ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2లో ఉన్నవి సెమీస్ కు వెళతాయి. అక్కడ నుంచి షరా మామూలే. సెమీస్ లో గెలిచిన జట్లు ఫైనల్ కు చేరతాయి.
Also Read: ముంబై ఇండియన్స్ నుంచి.. రోహిత్ అవుట్?
భారత్ ఆడే మ్యాచ్ ల వివరాలు: అక్టోబర్ 4 న న్యూజిలాండ్, 6 న పాకిస్తాన్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇటీవల ఆసియా కప్ లో భారత్ ఫైనల్ వరకు ఓటమన్నదే లేకుండా వెళ్లి.. శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. రన్నరప్ గా మిగిలింది.