EPAPER

ICC: క్రికెట్‌ లో 3 కొత్త రూల్స్‌..ఇకపై అన్ని డేనైట్‌ టెస్ట్‌లు, రెండు బంతులే ?

ICC: క్రికెట్‌ లో 3 కొత్త రూల్స్‌..ఇకపై అన్ని డేనైట్‌ టెస్ట్‌లు, రెండు బంతులే ?

Cricket Rules: క్రికెట్.. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఆట. ముఖ్యంగా మన భారతదేశంలో ( India ) మాత్రం క్రికెట్ ( Cricket ) అంటే పడి చచ్చిపోతారు. క్రికెట్ ఆడటంతో పాటు మ్యాచ్లు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తారు. అందుకే మన ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) లాంటి టోర్నీలకు.. విపరీతంగా డిమాండ్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే… 10 ఓవర్ల మ్యాచులకు కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి.


ICC to change three major rules in the international cricket

అయితే… ఇలాంటి నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ లో  కొత్త రూల్స్ ( Cricket Rules ) తీసుకువచ్చేందుకు… ఐసీసీ పాలక మండలి ( International Cricket Council ) నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత క్రికెట్లో మూడు కొత్త రూల్స్ ( Cricket Rules) తీసుకురావాలని అనుకుంటున్నారట. టెస్టు, వన్డేలకు ప్రాధాన్యత కల్పించేలా… ఈ నిర్ణయాలు ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఐసీసీ… ముఖ్యంగా మూడు రూల్స్ పైన ( Cricket Rules) దృష్టి పెట్టిందట.

Also Read: IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలని కాంగ్రెస్ హుకుం ?


అందులో మొదటిది… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో (WTC) కచ్చితంగా మూడు టెస్టులు ఉండేలా… రూల్స్ మార్చాలని ఐసిసి అనుకుంటుందట. అంతే కాకుండా… డే అండ్ నైట్ టెస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని… ఆ దిశగా ఐసీసీ అడుగులు వేయను ఉందట. ఎక్కువ శాతం డే అండ్ నైట్ టెస్టు నిర్వహించేలా… ప్లాన్ చేస్తున్నారట. ఇక చివరిది వన్డే ఫార్మాట్. ఇందులో రెండు బంతులు మాత్రమే వినియోగించేలా… ఐసీసీ ( International Cricket Council ) రూల్స్ మార్చనుందట.

Also Read: IND VS NZ: గెలుపు జోష్ లో ఉన్న న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ.. కీలక ప్లేయర్ దూరం!

అంటే మొదటి 25 ఓవర్లకు ఒక బంతి, చివరి 25 వరకు మరొక బంతి… ఇలా 50 ఓవర్లలో రెండు బంతులు మాత్రమే యూజు చేసేలా.. వ్యూహాలు రచిస్తోందట ఐసీసీ పాలక మండలి. ఈ రూల్స్ విషయంలో… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని జట్ల బోర్డులతో సమావేశం కాబోతుందట. వారందరితో సమావేశమైన తర్వాత ఈ మూడు రూల్స్… తీసుకురావాలని భావిస్తోందట ఐసీసీ పాలక మండలి ( International Cricket Council ) .

Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

అయితే ఈ మూడు రూల్స్ లపై… క్రికెట్ బోర్డులు ఎలా స్పందిస్తాయో చూడాలి. అయితే..  అంతర్జాతీయ క్రికెట్ లో  కొత్త రూల్స్ ( Cricket Rules ) తీసుకువచ్చేందుకు…  బీసీసీఐ ( BCCI ) కార్యదర్శి అమిత్ షా కొడుకు జై షా ( Jay Shah) అని అంటున్నారు. డిసెంబర్ లో ఐసీసీ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఈ మూడు కొత్త రూల్స్  జై షా  ( Jay Shah)  తీసుకు వస్తారని చెబుతున్నారు. మరి దీని పై  ఎంత మేరకు నిజం ఉందో చూడాల్సి ఉంది.

Related News

Emerging Asia Cup 2024: నేడు సెమీస్‌ పోరు…ఆఫ్ఘానిస్తాన్ తో టీమిండియా ఫైట్‌

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

Big Stories

×