Big Stories

ICC: బెస్ట్ టీ20 జట్టులో భారత్ నుంచి ముగ్గురికి చోటు!

ICC: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 సంవత్సరానికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. పోయిన ఏడాది జరిగిన టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మొత్తం 11 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది. భారత్ నుంచి విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

- Advertisement -

ఈ జట్టుకు ఇంగ్లాండ్ నుంచి జోస్ బట్లర్, సామ్ కరన్, భారత్ నుంచి సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, పాకిస్థాన్ నుంచి మహ్మద్ రిజ్వాన్, హారిస్ రవూఫ్, ఐర్లాండ్ నుంచి జోష్ లిటిల్, జింబాంబ్వే నుంచి సికిందర్ రాజ, న్యూజిలాండ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్, శ్రీలంక నుంచి వానిందు హసరంగ ఎంపికయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News