Sunrisers Hyderabad Ugadi Wishes to Telugu State People: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సన్ రైబర్స్ జట్టు ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఐపీఎల్ సీజన్ 2024 హోమ్ గ్రౌండ్ లో చెలరేగిపోతున్న హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు విసెష్ చెప్పింది.
ఐపీఎల్ సీజన్ ఉన్నా లేకుండా నిత్యం సన్ రైజర్స్ జట్టు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ ను ఉత్తేజ పరుస్తూ ఉంటుంది. తాజాగా ఉగాది సందర్భంగా ఫ్యాన్స్ కు వినూత్న రీతిలో సన్ రైజర్స్ జట్టు శుభాకాంక్షలు చెప్పింది.
ఆరెంజ్ ఆర్మీ తన ట్వీట్టర్ ఖాతాలో స్వచ్ఛమైన తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పోస్ట్ పెట్టింది. సాంప్రదాయ దుస్తుల్లో కెప్టెన్ పాట్, భువనేశ్వర్, మార్క్రమ్, క్లాసిన్ కలిసి ఉన్న ఫోటోను సన్ రైజర్స్ టీం పోస్ట్ చేసింది. కాగా, ఈరోజు ఛండీఘర్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు పంజాబ్ జట్టుతో తలపడనుంది.