E-race: హైదరాబాద్ నడిబొడ్డున్న రేస్ కార్లు రయ్..రయ్..మంటూ దూసుకెళ్తున్నాయి. నక్లెస్ రోడ్డులోని రేసింగ్ సర్క్యూట్లో రేసర్లు కంటికి కనిపించనంత వేగంతో దూసుకుపోతున్నారు. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు ఈ రేస్లో పొల్గొన్నారు. రేసును తిలకించడానికి సినీనటులు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున నక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు.
మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్, ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, నటుడు రామ్ చరణ్ రేసును తిలకిస్తున్నారు. పెద్ద ఎత్తున నగరవాసులు నక్లెస్ రోడ్డుకు చేరుకొని రేస్ను ఎంజాయ్ చేస్తున్నారు.
మహింద్రా, జాగ్వార్, అవలాంచ్, కప్రా, నిస్సాన్ కంపెనీలకు చెందిన కార్లు రేస్లో పాల్గొన్నాయి. ప్రాక్టీస్ సెషన్ తర్వాత రేస్ డ్రైవర్లతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించడంతో వారితో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పొటీపడ్డారు.