వివరాల్లోకి వెళితే.. కార్తికేయ మౌర్య అనే విద్యార్థి తన ఎక్స్ ఖాతాలో కెట్టో లింక్ ను షేర్ చేసి, పంత్ సాయం కోరాడు. చండీగఢ్ విశ్వ విద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. పార్ట్ టైమ్ చేసుకుంటూ చదువుకుంటున్నాను. నాకు సరైన ఉద్యోగం లేక చదువు మధ్యలో ఆగిపోయింది. మీరు చేసే సాయంతో నా భవిష్యత్ కు మేలు కలుగుతుందని రాసుకొచ్చాడు.
దీనికి రిషబ్ పంత్ స్పందించి.. డబ్బులు పంపించాడు. అలాగే మీ కలలను నెరవేర్చుకోండి. ఎంత కష్టమైనా సరే, వాటిని చేరుకోండి.. అక్కడ దేవుడు మన కోసం మంచి ప్రణాళికలు సిద్ధం చేసే ఉంటాడు. అని రాసుకొచ్చాడు. ఇవన్నీ చూసిన కొందరు పనిగట్టుకుని ఆ కుర్రాడిని తిట్టడం మొదలుపెట్టారు. జాతీయ స్థాయి ఆటగాడిని మోసం చేశావంటూ ట్రోల్ చేశారు. ఇది చూసిన కుర్రాడు.. బాబోయ్ ఇంత విద్వేషాన్ని భరించలేను.. అవి తిరిగి పంపించేస్తాను. నన్ను క్షమించండి అంటూ రాసుకొచ్చాడు.
Also Read: దులీప్ ట్రోఫీ నుంచి ముగ్గురు అవుట్..!
నిజంగా ఇదెంతో బాధాతప్త హ్రదయంతో ఆ కుర్రాడు రాసినట్టుగా నెటిజన్లు పేర్కొంటున్నారు. నిజమో, అబద్ధమో పంత్ సాయం చేశాడు. అతను తీసుకున్నాడు. అది వారిద్దరి మధ్య వ్యవహారం. మీకెందుకు నోటి దురద, మీరేమీ రూపాయి ఇవ్వలేదు కదా.. ఆ కుర్రాడు ఎలాంటివాడో మీకు తెలీదు. ఒకవేళ నిజంగా చదువుకోవడానికే అయితే, ఆ కుర్రాడి భవిష్యత్తుని మీరే నాశనం చేసినట్టు.. అని కొందరు అలా రాసినవారిని తిట్టిపోస్తున్నారు.
ఈలోకంలో నేడు పాప పుణ్యాలను విచారిస్తూ పోతే, ఏ ఓక్కరికి న్యాయం జరగదు. సాయం చేసేవారే కరవైపోతున్న ఈ రోజుల్లో పాపం పంత్.. ఏ మూడ్ లో ఉన్నాడో తెలీదు..సాయం చేశాడు. మీరు సలహా చెప్పాలంటే పంత్ కి చెప్పండి.. అంతేకానీ సహాయం అడిగి తీసుకున్న విద్యార్థిని ఆడిపోసుకోవడం మానవత్వం అనిపించుకోదని సైకాలజిస్టులు రాసుకొస్తున్నారు. దీనిని ఆటవిక నీతి అని కూడా అంటారని చెబుతున్నారు. సామాజిక మాద్యమాల్లో పోస్టింగులు పెట్టేవాళ్లు కొంత సంయమనం పాటించాలని రాసుకొస్తున్నారు.