Basit Ali Slams Pakistani Players Over Morkel Disrespect Over Team India And Bangladesh Test: పాకిస్తాన్ బౌలర్లు అహంకారులని… పందుల్లా తినడం తప్ప.. క్రికెట్ అస్సలు ఆడటం రావడం లేదని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే చిత్తుచిత్తుగా అన్ని మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఓడిపోతుందని ఆయన పేర్కొనడం జరిగింది. వరుసగా మ్యాచ్లు ఓడిపోయిన కూడా పాకిస్తాన్ బౌలర్లకు అసలు సిగ్గు రావడంలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బాసిత్ అలీ.
Also Read: IPL 2025: ఐపీఎల్ జట్లకు BCCI గుడ్ న్యూస్..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాలసీ…?
గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ క్రికెట్ టీం.. తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. టి20 ప్రపంచ కప్ సమయం నుంచి… ఇప్పటివరకు అత్యంత దారుణమైన ఓటములను ఎదుర్కొంది పాకిస్తాన్ జట్టు. ఎక్కడ కూడా.. కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. కోచులు, కెప్టెన్లను మార్చినా కూడా పాకిస్తాన్ రాత మారడం లేదు. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ జట్టు చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్ జట్టు.
ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో… పాకిస్తాన్ శత్రువుగా చూసే… టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. పాకిస్తాన్ ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ ను.. ఒక ఆట ఆడుతోంది టీమిండియా. మొదటి టెస్టులో… ఏమాత్రం బంగ్లాదేశ్ కు ఛాన్స్ ఇవ్వకుండా రెచ్చిపోయి ఆడింది టీమిండియా. ఈ తరుణంలోనే పాకిస్తాన్ సీనియర్లు, రిటైర్డ్ క్రికెటర్లు స్పందిస్తున్నారు. టీమిండియాను చూసి పాకిస్తాన్ క్రికెటర్లు నేర్చుకోవాలని మండిపడుతున్నారు.
Also Read: IPL 2025: MS ధోని కోసం చెన్నై కొత్త కుట్రలు..షాక్ లో ఫ్యాన్స్ ?
ఈ తరుణంలోనే మాజీ బౌలర్ బాసిత్ ఆలీ స్పందించారు. టీమిండియా, పాకిస్తాన్ ప్లేయర్ల మైండ్ సెట్ చాలా వేరుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ను వైట్ వాసు చేసిన బంగ్లాదేశ్ జట్టును టీమిండియా చాలా అద్భుతంగా చిత్తు చేయగలిగిందని కొనియాడారు. పాకిస్తాన్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది తప్ప గెలవడం లేదన్నారు. కానీ టీమిండియా ప్లేయర్లు మాత్రం రిలాక్స్ గా ఆడి మ్యాచ్ గెలుస్తున్నారని వెల్లడించారు. అదే సమయంలో మోర్కెల్ కోచింగ్ను టీమిండియా బౌలర్లు ఆస్వాదిస్తున్నారని కూడా వెల్లడించారు.