Asian Championship: కబడ్డీ అనేది ఒకప్పుడు గ్రామాల్లో బాగా ఫేమస్ అయిన ఆట. ఆ తర్వాత ఇది ప్రపంచదేశాల వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ ఆటలో ఛాంపియన్షిప్స్ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోని ఎన్నో కబడ్డీ ఛాంపియన్షిప్స్లో ఇండియా తన సత్తాను చాటుకుంది. తాజాగా మరోసారి ఇండియన్ కబడ్డీ టీమ్కు ఎవరూ సాటి రారని నిరూపించింది. తాజాగా జరిగిన ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో ఇండియన్ టీమ్.. 8వ సారి పతకాన్ని సాధించింది.
ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్స్ అనేవి ప్రారంభమయ్యి తొమ్మిదేళ్లే అయ్యింది. ఆ తొమ్మిదేళ్లలో 8 సార్లు ఇండియన్ టీమే గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. ఈసారి జరిగిన ఛాంపియన్షిప్స్లో ఇరాన్ టీమ్ను ఇండియా ఓడించి ఘన విజయం సాధించింది. ఇరాన్కు, ఇండియాకు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ థ్రిల్లింగ్గా సాగింది. సౌత్ కొరియాలోని బూసాన్ డోగ్ యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్యోక్డ్యాంగ్ కల్చరల్ సెంటర్లో ఈ ఫైనల్ మ్యాచ్ చోటుచేసుకుంది.
ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో ఇండియా అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా పేరు తెచ్చుకుంది. తాజాగా అందుకున్న విజయంతో మరోసారి ఈ విషయాన్ని నిరూపించుకుంది ఇండియన్ కబడ్డీ టీమ్. ఫైనల్ మ్యాచ్ మొదలైన తర్వాత ఇరాన్ స్కోర్ విషయంలో దూసుకుపోయింది. దీంతో ఇండియా ఓడిపోతుందని అనుకున్నారంతా. కానీ ఇండియన్ డిఫెండర్స్ చాలా చాకచక్యంతో మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లారు. ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో ఇండియా.. అవతలి టీమ్ను ఆల్ ఔట్ చేయడం ఇది 10వ సారి.
ఫైనల్లో మొదటి రౌండ్ పూర్తయ్యే సమయానికి 23-11 పాయింట్స్తో ఇండియా ఆధిక్యంలో ఉంది. సెకండ్ రౌండ్లో ఇరాన్ మధ్య మధ్యలో తన స్పార్క్ను చూపించిన ఇండియా చేసిన హై స్కోర్ను బీట్ చేయడం మాత్రం వారికి కష్టమయ్యింది. ఇండియా సాధించిన ఈ విజయాన్ని ప్రేక్షకులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కబడ్డీనే తమ లక్ష్యంగా పెట్టుకునే ఎంతోమంది ఆటగాళ్లకు ఇండియన్ కబడ్డీ టీమ్ స్ఫూర్తినిస్తుందంటున్నారు.