Arjun Tendulkar Might Join RCB In IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 17 సంవత్సరాలుగా.. ఏ టోర్నమెంట్ కూడా సక్సెస్ కాని విధంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సక్సెస్ అయింది. ఇప్పటికి కూడా చాలా విజయవంతంగా ఈ టోర్నమెంట్ కొనసాగుతోంది. అయితే ఐపిఎల్ టోర్నమెంట్ లో 17 సంవత్సరాలుగా… ఛాంపియన్గా నిలవాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూడా కప్ గెలవలేదు బెంగళూరు.
చాలామంది కెప్టెన్లు మారారు, ప్లేయర్లను కూడా మార్చేసింది.. కోచ్ లు కూడా కొత్తవారు వచ్చారు. కానీ రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు రాత మారడం లేదు. ఎంతమంది డేంజర్ ప్లేయర్లు ఉన్నా కూడా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్గా నిలవడం చాలా కష్టతరం అయిపోయింది. మాక్సిమామ, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ ఇలాంటి డేంజర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కూడా… బెంగళూరు విజేతగా నిలవడం లేదు.
అయితే ఇప్పుడు అన్ని జట్లు 2025 ఐపీఎల్ కోసం.. రెడీ అవుతున్నాయి. అయితే 2025 ఐపీఎల్ కోసం ముందుగానే.. ఈసారి మెగా వేయడం జరగనుంది. ఈ సంవత్సరం డిసెంబర్లో మెగా వేలం నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆ దిశగా బీసీసీఐ అడుగులు కూడా వేయడం జరుగుతుంది. దీంతో ఏ ప్లేయర్లను కొనుగోలు చేయాలి ? ఏ ప్లేయర్లను వదిలేయాలి? అనే దాని పైన అన్ని జట్లు కసరత్తులు మొదలుపెట్టాయి.
Also Read: Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్ ను అవమానించిన గంభీర్..?
ఈ నేపథ్యంలో ముంబై ఆటగాడు, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను ఆర్సిబి జట్టులోకి తీసుకురావాలని కోహ్లీ ప్లాన్ ఇచ్చాడట. దీంతో ఈ మెగా వేలంలో కచ్చితంగా సచిన్ టెండూల్కర్ కొడుకు.. అర్జంట్ టెండూల్కర్ ఆర్సిబి జట్టులోకి వస్తారని అందరూ అంటున్నారు. ప్రస్తుతం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో ఆడుతున్నాడు అర్జున్ టెండూల్కర్.
Also Read: IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్
ఈ టోర్నమెంట్లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అర్జున్ టెండూల్కర్. అంతేకాదు కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో ఏవిధంగా 9 వికెట్లు.. తీసి పర్వాలేదనిపించాడు. ఈ తరుణంలోనే మళ్లీ అర్జున్ టెండూల్కర్ హాట్ టాపిక్ అయ్యారు. అటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ ను.. ఈసారి కొనుగోలు చేయాలని ఆర్సిబి అనుకుంటోoదట.
అదే సమయంలో… హైదరాబాద్ జట్టును వీడి…. నితీష్ రెడ్డి… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. మొన్నటి ఐపిఎల్ సీజన్ లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడాడు. అందుకే అతన్ని కొనుగోలు చేయాలని… బెంగళూరు జట్టు భావిస్తోందట. మంచి రేటు పలికితే తాను కూడా బెంగళూరు వెళ్లేందుకు నితీష్ కుమార్ రెడ్డి రెడీ అయినట్లు సమాచారం.