Ajit Agarkar : భారత్ క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంపిక కోసం బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఈ పదవి కోసం చాలా మంది పోటీలో ఉన్నారు. అయితే ఈ రేసులో భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ ముందున్నాడు. అగార్కర్ కే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు అగార్కర్ డిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సహాయక కోచ్ గా ఉన్నాడు. తాజాగా ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. అగార్కర్ కే ఛైర్మన్ పదవికి దక్కుతుందని ఇప్పటికే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ నుంచి తప్పుకోవడంతో ఈ కథనాలకు మరింత బలం చేకూరింది.
సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ వెంటనే పూర్తయితే.. వెస్టిండీస్తో టీ20 సిరీస్కు భారత జట్టును అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశం ఉంది.
సెలెక్టర్ల వార్షిక వేతనాల అంశాన్ని బీసీసీఐ సమీక్షేంచే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ ఛైర్మన్కు ఏడాదికి రూ.1 కోటి, సెలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.90 లక్షల చొప్పున బీసీసీఐ చెల్లిస్తుంది. అయితే ఢిల్లీ సహాయక కోచ్గా, కామెంటేటర్ గా అగార్కర్ అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు.