Moon Facts : చంద్రుడు.. మన అందరికీ తెలుసు. పుట్టినప్పటి నుంచి అమ్మ చంద్రుడిని చూపింది చందమామ రావే జాబిల్లి రావే.. అంటూ పాటలు పాడుతూ అన్నం తినిపిస్తుంది. చంద్రునిపై దశాబ్ధాల క్రితమే మనిషి అడుగు పెట్టాడు. యూరీ గగారిన్ చంద్రుడిపై పాదం మొపిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇక మన ఇస్రో కూడా చంద్రునిపైకి లాండర్ను పంపించి అగ్రదేశాల సరసన నిలిచిన విషయం తెలిసిందే.
చంద్రునిపై అనేక పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. చందమామపై దాగున్న రహస్యాలు శోధించేందుకు అనేక దేశాలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని పరిశోధనలు చూస్తుంటే అక్కడ మనిషి జీవించే రోజు త్వరలోనే రాబోతుందున్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
Read More : వావ్.. గాలి నుంచి నీరు తీస్తున్నారు..!
అయితే చంద్రుని గురించి మీకు తెలియని ఒక సిక్రేట్ ఉంది. చంద్రుడిపై అసలు సౌండ్ ఉండదు. అంతా నిశబ్ధంగా ఉంటుంది. చంద్రుడిపైకి వెళ్లినవారు కూడా వినికిడి శక్తిని కోల్పోతారు. దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.
చంద్రునిపై ఏ శబ్ధం ఉండదు. అక్కడికి వెళ్లినవారు ఏమి వినలేరు. వారిని మాటలు వారికి వినపడవు. దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కారణం ఉంది. భూమిపై మనం మాట్లాడితే ఆ మాటలు మనకే కాదు.. ఊరంతా విరపడతాయి. ఏ శబ్ధం చేసినా మనతో పాటు మన చుట్టుపక్కల వారికి కూడా వినపడుతుంది. దీనికి గల ముఖ్య కారణం గాలి. గాలి ధ్వారానే ధ్వని ఒకచోటు నుంచి మరోచేటుకు ప్రసారం అవుతుంది. అలానే మన చెవులకు కూడా చేరుతుంది.
Read More : ఈ జంతువులు రాత్రి కూడా వేటాడతాయి..!
చంద్రునిపై ఎటువంటి గాలి ఉండదు. కాబట్టి ఎక్కడి ధ్వని తరంగాలు అక్కడే ఉంటాయి. ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రసారం కావు. దీనివల్ల ఎటువంటి శబ్ధాలు వినపడవు. దీంతో మనకేమైన చెవుడు వచ్చిందా అనే భావన కలుగుతుంది. మనం మాట్లాడిన మాటలు కూడా మనకు వినపడ పోవడానికి చంద్రునిపై ఇదే కారణం.