Regeneretive Medicine:- మనిషి శరీరం అనేది ఎప్పటికైనా ఒక మిస్టరీనే అని నిపుణులు అంటుంటారు. మనిషి శరీరం గురించి ఎన్ని పరీక్షలు చేసినా.. మనకు తెలియని ఏదో ఒక విషయం దాగి ఉంటుందని చెప్తుంటారు. అందుకే అన్ని ఆరోగ్య సమస్యలు అందరిపై ఒకే లాగా ప్రభావం చూపించవని వారి అభిప్రాయం. వారి శరీరంలో ఉండే సెల్స్తో టెక్నాలజీని జతచేర్చి.. ఎలాంటి ఆరోగ్య సమస్యకు అయినా చెక్ పెట్టడం కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మానవ శరీరం దేన్ని అయినా తట్టుకునే శక్తితో తయారవుతుంది. దాన్నే బయో మెకానిజం అంటారు. టెక్నాలజీ అనేది అభివద్ధి చెందిన తర్వాత బయో మెకానిజంను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని శాస్త్రవేత్తలు భావించారు. దీని సాయంతో రిస్టోరేటివ్, రీజెనరేటివ్ మందులను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి మందులు భయంకరమైన క్రోనిక్ వ్యాధుల నుండి మనుషులను కాపాడుతూ వస్తున్నాయి. డయాబెటీస, గుండెపోటుకు సంబంధించిన మందులు కూడా ఈ ప్రక్రియతోనే తయారు చేయబడుతున్నాయి.
అసలు రీజెనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటి అని చాలామందికి క్లారిటీ లేదు. ఇది అడ్వాన్స్ టెక్నాలజీతో చేసే ఒక రీసెర్చ్. ఇతర అభివృద్ధి దేశాలతో మొదలైన ఈ మెడిసిన్.. ఇప్పుడు ఇండియాలో కూడా విపరీతంగా ఉపయోగపడుతోంది. పలు ఆసుపత్రులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ముంబాయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రీజెనరేటివ్ మెడిసిన్ అనేది తాజాగా లాంచ్ అయ్యింది. అవయవాలలో కలిగే మార్పులను సరిచేయడమే రీజెనరేటివ్ మెడిసిన్ ముఖ్య లక్ష్యం. ఇది ఒక్క ప్రక్రియతో కాకుండా ఇందులో ఎన్నో ప్రక్రియలు కలిసి ఉంటాయి.
మోడర్న్ టెక్నాలజీతో శరీర అవయవాల ఫంక్షన్స్ను మామూలుగా మార్చవచ్చు. కానీ దాని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అల్జీమర్స్, గుండె జబ్బు లాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే రీజెనరేటివ్ మెడిసిన్ అనేది అందుబాటులోకి వచ్చింది. దెబ్బతిన్న అవయవాల ఫంక్షన్స్ను ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మామూలుగా మార్చగలిగే టెక్నాలజీతో రీజెనరేటివ్ మెడిసిన్ తయారు చేయబడింది. దీని సక్సెస్ రేటు కూడా ఎక్కువగానే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.