EPAPER

Japan:- గాలి నుండి నీటి తయారీ.. జపాన్ కొత్త ఆలోచన..

Japan:- గాలి నుండి నీటి తయారీ.. జపాన్ కొత్త ఆలోచన..

Japan:- నీరు, గాలి.. ఈ రెండు మానవాళి జీవనానికి చాలా ముఖ్యం. కానీ ఈరోజుల్లో కాలుష్యం బారిన పడుతున్న వాటిలో ఈ రెండే ప్రధాన స్థానాల్లో ఉన్నాయి. అందుకే గాలిని, నీటిని ప్యూరిఫై చేయడానికి ఎన్నో కొత్త కొత్త విధానాలను కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా ఈజిప్ట్ శాస్త్రవేత్తలు.. ఇప్పుడు ఉన్న పరిశోధనలు అన్నింటిని దాటి కొత్త రకమైన పరిశోధనకు శ్రీకారం చుట్టారు. వారి గాలితో నీటిని తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.


గాలితో నీటి తయారీ ఏంటి అని ఆశ్చర్యంగా ఉన్నా.. దానిని నిజం చేస్తామంటున్నాయి జపాన్, ఈజిప్ట్. ఒక కొత్త టెక్నాలజీ సాయంతో గాలి నుండి నీటిని తయారు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది జపాన్ సంస్థ మిజుహా. ఈ పరికరానికి కుసూ అనే పేరు పెట్టారు. అంటే జపాన్ భాషలో నీరు, గాలి అని అర్థం. ఇది ఒక వాటర్ కూలర్. ఈ వాటర్ కూలర్ గాలిలో ఉండే ఆవిరిని పీల్చుకొని తాగునీటిలాగా మారుస్తుంది. ఇది ఐరన్ ఎక్స్‌ఛేంజ్ సిస్టమ్, కార్బన్ ఫిల్టర్స్ లాంటి ఫీచర్‌తో తయారు చేయబడుతుంది.

చాలాకాలంగా గాలి నుండి నీటిని తయారు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయి ఉన్న మిజుహ సంస్థ మరో రెండు నెలల్లో దీని ప్రొడక్షన్‌ను పూర్తి చేసి మార్కెట్లోకి లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని ఆ సంస్థ హెడ్ స్వయంగా ప్రకటించారు. గాలిలోని ఆవిరి శాతాన్ని బట్టి ఈ పరికరం రోజుకు 14 లీటర్ల తాగునీటిని తయారు చేయగలుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీలకు, టూరిస్ట్ రిసార్టులకు ఈ పరికరం కమర్షియల్ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చెప్తోంది.


ఈ వాటర్ ఎక్స్‌ట్రాక్టర్స్ అనేవి పూర్తిగా మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత ఈజిప్ట్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ వంటి దేశాలకు దీనిని ఎగుమతి చేయాలని మిజుహా లక్ష్యంగా పెట్టుకుంది. ఈజిప్ట్‌ మార్కెట్‌కు తగినట్టుగా కుసులో మార్పులు చేస్తామని, అక్కడ సేల్స్‌ను పెంచడానికి ఎలాంటి మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మిజుహా చెప్తోంది. జపాన్‌లో నీటిని దేవుడిగా భావిస్తారు. అందుకే మిజుహా నోమా అనే పేరుతో పిలుచుకుంటారు. అందుకే ఈ సంస్థకు మిజుహా అనే పేరు పెట్టినట్టు బయటపెట్టారు.

ప్రస్తుతం ఈజిప్ట్‌లో నీటి కరువు చాలా ఉంది. కనీస సదుపాయాలకు కూడా అక్కడ చాలామందికి ప్రజలకు నీటి సౌకర్యం లభించడం లేదు. అవసరమైనదానికంటే 55 శాతం తక్కువ నీటి సదుపాయంతో అక్కడి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. అందుకే కుసు అక్కడి వారికి తాగునీటిని అందించడానికి సహాయంగా నిలుస్తుందని మిజుహా భావిస్తోంది. వాటర్ సిస్టమ్‌ను పెంపొందించడానికి ఈజిప్ట్‌లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ పూర్తిస్థాయిలో ప్రజలు సాయంగా నిలవడం లేదు. అందుకే మిజుహా ఈ ఆలోచనతో ముందుకొచ్చింది.

టిక్‌టాక్‌కు భారీ ఫైన్.. ఎందుకంటే..?

for more updates follow this link:-Bigtv

Tags

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×