EPAPER
Kirrak Couples Episode 1

Cyber Attack: 120 దేశాల్లో సైబర్ దాడులు

Cyber Attack: 120 దేశాల్లో సైబర్ దాడులు
Cyber Attack

Cyber Attack: నిరుడు 120కి పైగా దేశాలకు సైబర్ దాడుల ముప్పు తప్పలేదు. ఈ ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో ఉక్రెయిన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, తైవాన్ అగ్రభాగాన నిలిచాయని మైక్రోసాఫ్ట్ తాజా నివేదిక వెల్లడించింది.


జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు చోటు చేసుకున్న సైబర్ దాడులను విశ్లేషించిన ఆ సంస్థ ‘డిజిటల్ డిఫెన్స్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇక ఏయే దేశాల ప్రభుత్వాలు ఎక్కువగా సైబర్ దాడులకు పాల్పడ్డాయన్న వివరాలను ఆ నివేదిక పొందుపర్చింది.

రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా తదితర దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. సైబర్ దాడుల్లో దాదాపు సగం నాటో సభ్యదేశాలను లక్ష్యంగా చేసుకుని సాగాయి. ఇక భారత్‌పైనా సైబర్ దాడుల తీవ్రత పెరుగుతోందని నివేదిక వెల్లడించింది.


ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జరిగిన సైబర్ దాడుల్లో 13 శాతం భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నవే. నిరుడు అత్యధిక దాడులను ఎదుర్కొన్న దేశంగా భారత్ ఐదో స్థానంలో ఉంది.

Related News

Lava Festive Season Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. కేవలం రూ.6,699లకే కొత్త మొబైల్, ఇదే కదా కావాల్సింది!

Infinix Zero Flip: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్

OnePlus Diwali Sale: వన్‌ప్లస్ దీపావళి ఆఫర్.. వీటిపై కొప్పలు తెప్పలు డిస్కౌంట్లు, అస్సలు వదలొద్దు!

Samsung Galaxy S24 FE: శాంసంగ్ పరుగులు.. అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ వచ్చేస్తున్నాయ్!

OnePlus 13: 24 GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు కెవ్ కేక!

New Smartphone: 48 MP సోనీ సెన్సార్‌తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకేనా!

Flipkart Big Billion Days Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. రూ.7,499లకే 5జీ ఫోన్, మొత్తం 6 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు!

Big Stories

×