Cyber Attack: నిరుడు 120కి పైగా దేశాలకు సైబర్ దాడుల ముప్పు తప్పలేదు. ఈ ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో ఉక్రెయిన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, తైవాన్ అగ్రభాగాన నిలిచాయని మైక్రోసాఫ్ట్ తాజా నివేదిక వెల్లడించింది.
జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు చోటు చేసుకున్న సైబర్ దాడులను విశ్లేషించిన ఆ సంస్థ ‘డిజిటల్ డిఫెన్స్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇక ఏయే దేశాల ప్రభుత్వాలు ఎక్కువగా సైబర్ దాడులకు పాల్పడ్డాయన్న వివరాలను ఆ నివేదిక పొందుపర్చింది.
రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా తదితర దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. సైబర్ దాడుల్లో దాదాపు సగం నాటో సభ్యదేశాలను లక్ష్యంగా చేసుకుని సాగాయి. ఇక భారత్పైనా సైబర్ దాడుల తీవ్రత పెరుగుతోందని నివేదిక వెల్లడించింది.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జరిగిన సైబర్ దాడుల్లో 13 శాతం భారత్ను లక్ష్యంగా చేసుకున్నవే. నిరుడు అత్యధిక దాడులను ఎదుర్కొన్న దేశంగా భారత్ ఐదో స్థానంలో ఉంది.