EPAPER
Kirrak Couples Episode 1

Indian Immigrants : అమెరికాకు వలసవెళుతున్న ఇండియన్లపై స్టడీ..

Indian Immigrants : అమెరికాకు వలసవెళుతున్న ఇండియన్లపై స్టడీ..
Indian Immigrants

Indian Immigrants : ఇండియాలో యువత ఎక్కువగా ఉన్నా వారిలో టాలెంట్ లేదని.. చదువుల విషయంలో చాలామంది ఆసక్తి చూపించరని.. ఇలాంటి ఎన్నో విమర్శలను మనం ఎంతోకాలంగా వింటూనే ఉన్నాం. అలాంటివారికి సరైన సమాధానం ఇవ్వడం కోసమేనేమో కొందరు యువతీయువకులు ఫారిన్ దేశాలకు వెళ్లి.. అక్కడ భారతీయుల సత్తా చాటుతున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతీ ఫారిన్ దేశంలో చెప్పుకోదగిన ఒక్క ఇండియన్ అయినా ఒక ఉన్నతస్థాయిలో కనిపిస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి.


మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, ఆల్పాబెట్‌కు సుందర్ పిచై.. వీటితో పాటు ఐబీఎమ్, అడోబ్, పాలో ఆల్టో నెట్‌వర్క్స్, వీఎమ్‌వేర్, విమియో.. ఇలాంటి ఎన్నో సంస్థలలో కామన్ పాయింట్ ఏంటంటే.. వాటిలోని ఉన్నతస్థాయిలో భారతీయులు, లేదా భారత సంతతికి చెందినవారు ఉండడమే. తాజాగా భారత్ నుండి వెళ్లి ఇతర దేశాల్లో తమ సత్తాచాటుకున్న వ్యక్తులపై భూటాన్.. ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో అందరికీ తెలియని ఇంకా ఎందరో వ్యక్తుల గురించి కూడా బయటపడింది.

భూటాన్ చేసిన సర్వే ప్రకారం.. దాదాపు భారత్‌కు చెందిన దాదాపు నాలుగు మిలియన్ మైనరీటల వ్యక్తులు అమెరికాలో ఉన్నతస్థానంలో ఉన్నారు. అందులో ఒక మిలియన్ వ్యక్తులు.. సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా వృత్తిని కొనసాగిస్తున్నారు. వారిలో కూడా 70 శాతంకు పైగా వ్యక్తులకు హెచ్ 1బీ వీసా ఉన్నట్టు తెలిసింది. అంతే కాకుండా భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని సర్వే తెలిపింది. తాజాగా యూట్యూబ్‌కు సీఈఓగా అపాయింట్ అయ్యింది కూడా ఒక భారత సంతతి అని గుర్తుచేసింది.


అమెరికాలో పనిచేస్తున్న ఎక్కువశాతం భారత సీఈఓలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో చదువుకున్నవారే అని భూటాన్ సర్వే తేల్చింది. కేవలం 2 శాతం యువతకు మాత్రమే అందులో అడ్మిషన్ దొరకుతుందని, అలా అడ్మిషన్ దొరికి చదువుకున్న తర్వాత వారు ఫారిన్ కలలతో అక్కడికి పయణమవుతున్నారని తెలుస్తోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని, అందుకే ఫారిన్ దేశాలు కూడా ఇక్కడ చదువుకున్నవారికి ఉద్యోగాలు ఇవ్వడంలో ముందుంటాయి.

Tags

Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×