E-Paper
Advertisement

Kavitha: ఈడీ విచారణకు హాజరైన కవిత.. అరుణ్ పిళ్లైతో కలిసి ప్రశ్నించే అవకాశం..

Kavitha: ఈడీ విచారణకు హాజరైన కవిత.. అరుణ్ పిళ్లైతో కలిసి ప్రశ్నించే అవకాశం..
Advertisement

Kavitha: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా?.. కారా?.. అనే ప్రశ్నకు తెర పడింది. ఎట్టకేలకు రెండో సారి కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కేవలం కవితను మాత్రం ఈడీ ఆఫీస్‌లోకి అనుమతించారు. వెంట వచ్చిన కవిత భర్త అనిల్, న్యాయవాది సోమభరత్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లను లోపలికి అనుమతించ లేదు.

ఇక ఆఫీసులోకి వెళ్తున్న క్రమంలో కవిత చిరునవ్వుతో పిడికిలి బిగింది అభిమానులకు అభివాదం చేశారు. ధైర్యంగా కవిత ఆఫీసులోకి వెళ్లారు. ఆమె భర్త దగ్గరుండి భుజం తట్టి ఈడీ కార్యాలయంలోకి పంపించారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను విచారించే అవకాశం ఉంది.

Advertisement

ఇక మార్చి 11న మొదటిసారి కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ మార్చి 16న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులిచ్చింది. దీంతో కవిత ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పెండింగ్‌లో ఉండడంతో మార్చి 16వ తేదీన కవిత విచారణకు హాజరుకాలేదు. ఆమె తరుపున న్యాయవాదులను పంపించారు. ఈక్రమంలో 20వ తేదీన మళ్లీ హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు.

Tags

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×