సీరియల్ నటి విష్ణుప్రియ అనే కంటే.. Sidshnu అంటే ప్రేక్షకులకు త్వరగా గుర్తొస్తుంది ఈమె.
తెలుగులో కుంకుమపువ్వు, జానకి కలగనలేదు, త్రినయని, అభిషేకం వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది.
ఎన్నో కష్టాలు పడుతూ ఈ స్టేజ్ కు ఎదిగానని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. రూ.1500 ఉన్న తన రెమ్యునరేషన్ ఇప్పుడు రూ.15 వేలు అయిందని, ఎంతో కష్టపడ్డానని తెలిపింది.
సీరియల్ నటుడు సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.
వీరిద్దరూ కలిసి నటించిన MR&MRS సుధామూర్తి యూట్యూబ్ సిరీస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
ఇటీవలే విష్ణుప్రియ 116 లక్ష్మీ స్వరూపాలతో వరలక్ష్మీ వ్రతం చేసుకుంది.
ప్రతి ఒక్కరి కాళ్లకు పసుపు రాసి, బొట్టుపెట్టి అచ్చమైన తెలుగు సంప్రదాయంలో వ్రతాన్ని ఆచరించిన వీడియో యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ కు చేరువలో ఉంది